Breaking News

రామ్మోహన్‌ నాయుడుపై ప్రయాణికుల ఆగ్రహం

Published on Sat, 12/06/2025 - 10:46

తెలుగు రాష్ట్రాల్లో విమాన ప్రయానికులు అవస్థలు అప్‌డేట్స్‌.. 

144 ఇండిగో సర్వీసులు రద్దు 

  • శంషాబాద్‌ నుంచి 144 ఇండిగో సర్వీసులు రద్దు
  • ఈరోజు ఒక్కరోజే భారీ సంఖ్యలో సర్వీసులు రద్దు. 
  • శంషాబాద్‌ నుంచి వెళ్లే 74 సర్వీసులు రద్దు.
  • శంషాబాద్‌ వచ్చే 70 సర్వీసులు క్యాన్సిల్‌. 

 

శంషాబాద్‌లో ఉద్రిక్తత..

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుపై ప్రయాణికుల ఆగ్రహం
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆవేదన.
  • ప్రయాణికులు మాట్లాడుతూ..
  • ఇక్కడే మేము ఇబ్బంది పడుతుంటే రామ్మెహన్‌ నాయుడు ఏం చేస్తున్నారని మండిపాటు.
  • పార్లమెంట్‌లో ప్రకటనలు తప్పితే చేసేందేమీ లేదు.
  • కేంద్రమంత్రిగా రామ్మోహన్‌ నాయుడు విఫలమయ్యారు.
  • ఆయన ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఏం ఉపయోగం అని ఆగ్రహం.

గన్నవరంలో అవస్థలు..

  • గన్నవరం విమానశ్రయంలో ఇండిగో ప్రయాణీకుల అవస్థలు
  • గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు
  • హఠాత్తుగా విమానం రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన
  • ఢిల్లీ విమానం రద్దుకు కారణం చెప్పాలని ఇండిగో కౌంటర్ సిబ్బందిని నిలదీసిన ప్రయాణీకులు.
  • విమానం రద్దు అయినట్లు మెసేజ్ పెట్టమంటూ ఇండిగో సిబ్బంది నిర్లక్ష్యంగా  సమాధానం
  • ఇండిగో సిబ్బంది సమాధానంపై  ప్రయాణికులు అసహనం
  • మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం నుంచి బయల్దేరాల్సిన ఇండిగో విమానం
  • అర్ధరాత్రి 3:30 గంటలకు విమానం రద్దైనట్లు మెసేజ్ పెట్టడం మండిపడుతున్న ప్రయాణీకులు

👉శంషాబాద్‌ విమానాశ్రయంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇండిగో తీరు, సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు విషయంలో ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు ఇవ్వలేదని ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో, స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, ఐదో రోజు కూడా ఇండిగో సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

 

👉వివరాల ​ప్రకారం.. శంషాబాద్‌ నుంచి పలు నగరాలకు వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. శంషాబాద్‌ నుంచి ఇండిగోకు చెందిన 69 సర్వీసులు నేడు రద్దు అయ్యాయి. దీంతో, ఆయా సర్వీసుల్లో టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తీరా వచ్చాక సర్వీసులు రద్దు విషయం తెలిసి.. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచార ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. మరోవైపు.. పలువురు ప్రయాణికులు వారికి చెక్‌ఇన్‌ అయ్యాక విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వాముల సైతం ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.

టికెట్‌ ధరలకు రెక్కలు..
👉ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. కోల్‌కతా నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమాన టికెట్‌ ధర శుక్రవారం ఏకంగా రూ.90,000కు చేరుకుంది. ముంబై నుంచి భువనేశ్వర్‌కు ఎయిరిండియా నడుపుతున్న విమానం టికెట్‌ ధర కూడా రూ.84,485 పలికింది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రూ.25 వేలు, విజయవాడకు రూ.18 వేలు పలికాయి.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు