Breaking News

ఆటోలో ఆరుగురు పిల్లలనే ఎక్కించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు 

Published on Tue, 12/13/2022 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆటోలో ఆరుగురు విద్యార్థులకు మించి ఎక్కించరాదు.. విద్యార్థులను పాఠశాలలో వదిలేందుకు, తిరిగి తీసుకెళ్లేందుకు ఆవరణలో వాహనాల కోసం స్థలం ఉండాలి.. పాఠశాల జోన్‌ ప్రాంతాల్లో సిగ్నల్స్, జీబ్రా లైన్స్‌ ఏర్పాటు చేయాలి.. పిల్లలు రోడ్‌ దాటేటప్పుడు గార్డ్‌ విధిగా ఉండాలి.. లాంటి నిబంధనలన్నీ కఠినంగా అమలు చేయాలి’ అని హైకోర్టు.. అధికారులను ఆదేశించింది.

 పాఠశాలల వద్ద విద్యార్థులు రోడ్‌ దాటేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని.. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన హనుమంతరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన నాలుగేళ్ల కూతురు రోడ్డు దాటుతుండగా ప్రమాదంలో మృతిచెందిందని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున కౌటూరు పవన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. దీనిపై అధికారులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ పరిధిలోని స్కూళ్ల యజమాన్యంతో సమావేశం నిర్వహించామని అఫిడవిట్‌లో చెప్పారు. ‘స్కూళ్లు ఉన్న చోట పలు ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్‌ రూల్‌ పెట్టాం. ఓవర్‌ స్పీడ్, ర్యాష్‌ డ్రైవింగ్‌ లాంటి నిరోధానికి చర్యలు తీసుకున్నాం. ట్రాఫిక్‌ రూల్స్‌పై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలని యజమాన్యాలకు చెప్పాం. సాధ్యమైన చోట ఫుట్‌ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు నిర్ణయించాం’ అని అందులో పేర్కొన్నారు. వీటిని కఠినంగా అమలు చేయాలన్న ధర్మాసనం.. పిటిషన్‌లో వాదనలు ముగించింది.    

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)