ఆటోలోనే.. అటూ ఇటూ

Published on Mon, 02/02/2026 - 07:31

సాక్షి, హైదరాబాద్: కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకున్న దోపిడీ కేసు దర్యాప్తును నగర పోలీసులు ముమ్మరం చేశారు. నిందితుల కోసం టాస్‌్కఫోర్స్, సీసీఎస్‌లకు చెందిన ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్‌ టీమ్స్‌ ఉత్తరప్రదేశ్‌తో పాటు హరియాణాకు వెళ్లి ఆరా తీస్తున్నాయి. ఈ నేరం చేయడానికి ముందు రెక్కీ చేసిన దుండగులు పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. తాము ఎక్కడి నుంచి వచ్చామో.. ఎటు వెళ్లామో.. పోలీసులకు అంతు చిక్కకుండా వాహనాలు మారుతూ ప్రయాణించారు.

 ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ దుండగులు పాతబస్తీలో షెల్టర్‌ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నాంపల్లిలోని జనతా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కోజికోడ్‌కు చెందిన రిన్షాద్‌పై దాడికి దిగిన దోపిడీ దొంగల ద్వయం.. ఆయన కాళ్లకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. రిన్షాద్‌ చేరుకునే సమయానికే వీళ్లు ఏటీఎం వద్ద కాపు కాసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడిని చంపడం దుండగుల లక్ష్యం కాదని.. కేవలం భయపెట్టి దోచుకోవాలన్నదే పథకం అని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే కాళ్లకు గురిపెట్టి కాల్చారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను బట్టి ఇప్పటి వరకు సేకరిచిన సమాచారం ప్రకారం దుండుగులు పాతబస్తీలో షెల్టర్‌ తీసుకున్నట్లు తేల్చారు.  

మరోసారి కోఠికి.. 
అక్కడి నుంచి ఒక ఆటోలో బయలుదేరిన ద్వయం.. మార్గంమధ్యలో మరోసారి కోఠికి చేరుకుంది. దోపిడీ తర్వాత రిన్సాద్‌ వచి్చన ద్విచక్ర వాహనంపై ఉమెన్స్‌ కాలేజ్, చాదర్‌ఘాట్‌ జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ వైపు వెళ్లారు. అక్కడి శ్యామ్‌బాబా దేవాలయం వద్ద ద్విచక్ర వాహనాన్ని వదిలేసి, తమ దుస్తులు మార్చుకున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి.. తిరిగి బయటికి వచ్చేసిన ద్వయం చౌరస్తా వైపు కాలినడకన వెళ్లింది. అక్కడ నుంచి మరో రెండుమూడు ఆటోలు మారుతూ అఫ్జల్‌గంజ్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్టకు చేరుకున్నారు. అట్నుంచి ఎక్కడకు వెళ్లారన్నది తేల్చడానికి ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను జల్లెడపడుతున్నాయి.  

క్లిష్టతరంగా దర్యాప్తు.. 
సంబంధిత ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రయాణంలో వీళ్లు ఎక్కడా ఆటో బుకింగ్, నగదు చెల్లింపు కోసం యాప్స్‌ వాడకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టతరంగా మారింది. బాధితుడు రిన్షాద్‌ నుంచి పూర్తి సమాచారం పోలీసులు సేకరించలేకపోతున్నారు. ఇతడికి మలయాళం మినహా మరో భాష రాకపోవడం అడ్డంకిగా మారింది. మలయాళం, తెలుగు తెలిసిన వ్యక్తిని ట్రాన్స్‌లేటర్‌గా పెట్టుకుని విచారిస్తున్నా పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదు. తాను షాక్‌లో ఉన్నానని, భయంగా ఉందని చెబుతున్న అతడు కీలక సమాచారం అందించట్లేదని అధికారులు పేర్కొంటున్నారు. వస్త్ర వ్యాపారం చేస్తున్న రిన్షాద్‌ వ్యవహారంలో హవాలా కోణాన్నీ అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.      

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)