DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్
Breaking News
అక్టోబర్ 2నే దసరా.. మద్యం, మాంసం అమ్మితే కఠిన చర్యలే!
Published on Tue, 09/30/2025 - 07:43
దసరా పండుగపై తెలంగాణలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 2న దసరా పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు గాంధీ జయంతి కూడా ఉంది. దీంతో.. మద్యం, మాంసం ప్రియులకు అసమంజస పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో..
హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2న జీహెచ్ఎంసీ పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం–1955లోని విభాగం 533 (బి) ప్రకారం ఈ నెల 24న జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఆ మేరకు సోమవారం జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులందరూ సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
Tags : 1