Breaking News

టోల్‌ ప్లాజాకు ‘పండుగ’

Published on Sun, 01/15/2023 - 01:18

చౌటుప్పల్‌: సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మూడు రోజులు గా పెద్ద ఎత్తున ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివెళుతు న్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి రికార్డు స్థాయిలో వాహనాలు వెళ్లాయి.

12వ తేదీన ఇరువైపులా 56,595 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఇందు లో కార్లు 42,844, ఆర్టీసీ బ స్సులు 1,300, ప్రైవేట్‌ బస్సు లు 4,913, గూడ్స్‌ వాహనాలు 7,538 ఉన్నాయి. 13వ తేదీన 67,577 వాహనాలు ఇరుమార్గాల్లో వెళ్లాయి. ఇందులో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1,851, ప్రైవేట్‌ బస్సులు 4,906, అలాగే 7,259 గూడ్స్, ఇతర వాహనాలు రాకపోకలు సాగించాయి.

11 ఏళ్లలో ఇదే మొదటిసారి: హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసలుగా మార్చిన తర్వాత 11 ఏళ్ల కాలంలో ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించడం ఇదే మొదటిసారని అంటున్నారు. సాధారణ రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజా నుంచి రోజుకు 30 వేల నుంచి 40 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు: సంక్రాంతి పండుగకు ఈ రహదారిగుండా పెద్ద సంఖ్యలో ప్రజానీకం వెళ్తుండటంతో పోలీసులు, జీఎమ్మార్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పంతంగి టోల్‌ప్లాజా, గ్రామాల కూడళ్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించారు.  

Videos

అనంతపురం జిల్లాలో గిరిజన విద్యార్థి దారుణ హత్య

అల్లుడు, కూతురుపై ముద్రగడ కీలక వ్యాఖ్యలు

పక్కా ప్లాన్ తో భర్తను హత్య చేసిన భార్య

వేల కోట్ల బిజినెస్ కాదని.. అఖిల్ భార్య చేసే పనేంటో తెలుసా..?

సారీ చెప్పినా.. వినరా.. జరిగేది జరుగుద్ది.. తెగేసి చెప్పిన KSR

లోకేష్ చెప్పినట్టే చేసి.. షాక్ ఇచ్చిన పబ్లిక్

చేప ప్రసాదం వేయించుకున్న VH.. ఎట్లా ఏసుకుండో చూద్దామా?

తిరుమలలో మరో అపచారం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి

పవన్ అడ్డాలో అరాచకాలు.. ఆధారాలతో బయటపెట్టిన వర్మ

Photos

+5

యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం (ఫొటోలు)

+5

ఎంపీతో క్రికెటర్‌ రింకూ సింగ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం: : మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)

+5

మిస్‌ యూనివర్స్‌ 2025 పోటీలకు మన తెలుగు తేజాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా అఖిల్‌- జైనాబ్ రిసెప్షన్‌ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : చేప మందు పంపిణీ.. పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)

+5

అఖిల్‌ అక్కినేని సతీమణి 'జైనబ్‌' ఫోటోషూట్‌ లుక్స్‌ చూశారా..? (ఫొటోలు)

+5

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)