Breaking News

విశ్వాసం కోల్‌పోయాం

Published on Fri, 02/27/2026 - 05:35

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గుపై విశ్వాసం సన్నగిల్లుతోందని తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్లను వేసవి నాటికి పూర్తిస్థాయిలో వాణిజ్య ఉత్పత్తిలోకి తేవాలన్నది జెన్‌కో లక్ష్యం. ఈ నేపథ్యంలో జెన్‌కోకు రోజుకు లక్ష టన్నుల బొగ్గు అవసరం. ఈ మొత్తాన్ని సింగరేణి నుంచి సమకూర్చుకోవడం సాధ్యం కాదని జెన్‌కో అంటోంది. పైగా సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు రావడం లేదని, కోల్‌ ఇండియా బొగ్గు కన్నా ధర ఎక్కువగా ఉంటోందని చెబుతోంది.

యాదాద్రికి అవసరమైన మేర బొగ్గు అందించలేమని సింగరేణి ఇటీవల జెన్‌కోకు లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం సింగరేణితో చర్చించగా, ఇతర రాష్ట్రాలకు నిలిపేసి తెలంగాణ జెన్‌కోకు బొగ్గు ఇస్తామని సింగరేణి భరోసా ఇచి్చంది. కానీ జెన్‌కో మాత్రం దీనిపై అసంతృప్తితో ఉంది. నాణ్యమైన బొగ్గు కోసం ప్రత్యామ్నాయం అవసరమని జెన్‌కో అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. వేసవి డిమాండ్‌ను తట్టుకోవాలంటే యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కీలకమని జెన్‌కో చెబుతోంది.  

నాణ్యత ఏదీ? 
కొన్నేళ్లుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. అదీగాక నాణ్యమైన బొగ్గు కూడా రావడం లేదు. గరిష్టంగా 3500 ఉష్ణశక్తి (జీసీవీ) ఇచ్చే బొగ్గు రావడమే కష్టంగా ఉందని జెన్‌కో అంటోంది. 4500 జీసీవీపైన ఉంటే తప్ప కొత్త ప్లాంట్లు నడపలేని స్థితి ఉంది. తరచూ బ్యాకింగ్‌ డౌన్‌ వల్ల ఉత్పత్తి తగ్గి భారం ఎక్కువవుతోందని చెప్పింది. జెన్‌కో సహా ఇప్పటి వరకూ 21 పరిశ్రమలు సింగరేణి బొగ్గుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 20 పరిశ్రమలు ఇప్పటికే బొగ్గు కొనుగోలు నిలిపివేశాయి. జెన్‌కో కూడా సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉందని భావిస్తోంది. టన్ను రూ. 4 వేలకు లభించే బొగ్గును కొన్ని సార్లు రూ. 7 నుంచి 8 వేలు పెట్టి కొనాల్సి వస్తోందని తెలిపింది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, ఇప్పటికే మార్కెట్లో చౌకగా విద్యుత్‌ లభిస్తోందని ప్రభుత్వానికి చెప్పింది.

తగ్గిన బొగ్గు ఉత్పత్తి
అవసరాలకు తగ్గట్టు బొగ్గు అందించడంలో సింగరేణి వెనుకబడుతోంది. కొత్త బ్లాక్‌లను చేజిక్కించుకోలేని పరిస్థితి, ఉన్న బ్లాకుల్లోనూ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి సింగరేణిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2021–22లో 65.53 మిలియన్‌ టన్నుల బొగ్గును సింగరేణి రవాణా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత డిసెంబర్‌ వరకూ 51.47 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యమైతే 43.73 మిలియన్‌ టన్నులకే పరిమితమైంది.

బొగ్గు ఆధారిత థర్మల్‌ ప్లాంట్లకు తరచూ బొగ్గు సరఫరా అనుకున్న సమయంలో చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో కోల్‌ ఇండియా, మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి బొగ్గు తీసుకోవాలనే ప్రతిపాదనను జెన్‌కో ముందుకు తెస్తోంది. సింగరేణి మాత్రం ఇతర రాష్ట్రాలకు నిలిపివేసి బొగ్గు అందిస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు.  

Videos

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)