Breaking News

ఎరువు.. ధరల దరువు

Published on Fri, 06/05/2026 - 06:16

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులకు ఎరువుల ధరల రూపంలో భారీ షాక్‌ తగిలింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరల పెరుగుదల నేపథ్యంలో కాంప్లెక్స్‌ ఎరువుల గరిష్ట చిల్లర ధరలను (ఎంఆర్‌పీ) ఎరువుల కంపెనీలు భారీగా పెంచాయి.

రాష్ట్రంలో ఈ నెల నుంచే ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌ తదితర పంటలు సాగు చేసే రైతులపై అదనపు భారం పడనుంది. ఈ పంటల్లో ప్రారంభ దశలోనే కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే విత్తనాలు, కూలీల వేతనాలు, పురుగు మందుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే యూరియా, డీఏపీ ధరలను కేంద్రం పెంచకపోవడం కొంత ఊరట. 

దిగుమతి భారం కావడంతో...
దేశంలో ఫాస్ఫేటిక్, పొటాషిక్‌ ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో అధిక భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో రవాణా వ్యయాలు, దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలపై ప్రత్యక్షంగా పడింది. దీంతో సాగులో వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ భారీగా పెంచింది.

ఎరువుల వ్యాపార వర్గాలు, వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం 20:20:0:13, 10:26:26, 17:17:17 వంటి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచారు. ముఖ్యంగా ఫాస్ఫేటిక్, పొటాషిక్‌ ఎరువుల తయారీకి అవసరమైన రాక్‌ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్‌ యాసిడ్, అమోనియా, పొటాష్‌ వంటి ముడి పదార్థాలను భారత్‌ పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఎంఆర్‌పీలను సవరించినట్టు తెలుస్తోంది.

యూరియా ధర పెంచకపోవడం ఊరటే 
రైతులు అత్యధికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరలు యథాతథంగా ఉన్నాయి. యూరియా బస్తా రూ.266.50, డీఏపీ బస్తా రూ.1,350కే లభిస్తోంది. భారీ సబ్సిడీ కారణంగా ఈ ధరలను ప్రస్తుతం పెంచకుండా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ భారం భరిస్తుండటంతో ఈ రెండు ఎరువుల ధరలను ప్రస్తుతం పెంచలేదు. దీంతో రైతులకు కొంత మేర ఊరట లభించినా, కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెరుగుదల మొత్తం సాగు వ్యయాన్ని పెంచనుంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌లో లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తారు.

ఈ నేపథ్యంలో ధరల పెంపు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా రైతులపై పడే అవకాశం ఉంది. కాంప్లెక్స్‌ ఎరువులపై పడిన భారం కార ణంగా ఖరీఫ్‌ సాగు ఖర్చులు పెరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 20:20:0:13 బస్తాపై రూ.500 పెరిగితే వరి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనపు భారం కానుంది.పత్తి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనంగా భరించాల్సి వస్తుంది. అయితే రాష్ట్రంలో వరి, పత్తి, సోయాబీన్, మొక్క జొన్న, కూరగాయల పంటలకు కాంప్లెక్స్‌ ఎరువులతో పాటు యూరియాను కూడా అధికంగానే వినియోగించడం పరిపాటిగా మారింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)