Breaking News

విద్యుత్‌ చార్జీలు పెంచొద్దు.. ప్రజలపై భారం వేయొద్దు

Published on Fri, 01/09/2026 - 01:41

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్‌ పంపిణీ సంస్థలకు సూచించారు. డిస్కంల ఆర్థిక లోటుపై ప్రభుత్వం సరైన నిర్ణ యం తీసుకుంటుందని తెలిపారు. దీంతో పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ, అవసర నివేదిక(ఏఆర్‌ఆర్‌)ల్లో విద్యు త్‌ చార్జీల భా రం లేకుండానే విద్యుత్‌ నియంత్రణ మండలికి తమ ప్రతిపాదనలు అందించాయి. డిస్కంల ఏఆర్‌ఆర్‌లను గురువారం ఈఆర్‌సీ ప్రజల ముందుకు తెచి్చంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2026–27 వార్షిక సంవత్సరానికి రూ. 22,104 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి.

నివేదికలను గత ఏడాది డిసెంబర్‌లోనే ఈఆర్‌సీ ముందుకు తెచ్చాయి. ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుతో పాటు, పరోక్ష విధానంలో టారిఫ్‌ పెంపును ప్రతిపాదించాయి. అయితే పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వీటిని బయటకు వెల్లడించలేదు. దీనిని డిప్యూ టీ సీఎం పరిశీలించి, చార్జీల పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అంగీకరించబోదని డిస్కంలకు సూచించారు. దీంతో ఏఆర్‌ఆర్‌ నివేదికలను సవరించి, ప్రభుత్వం నుంచి లోటును పూడ్చుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణకు వి ద్యుత్‌ నియంత్రణ మండలి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఏఆర్‌ఆర్‌లను వెల్లడించాయి. దక్షిణ డిస్కం రూ.9,583 కోట్లు, ఉత్త ర డిస్కం రూ.12,521 కోట్ల లోటులో ఉన్నట్టు ఆయా నివేదికల్లో పేర్కొన్నాయి. ఈనెల 31 వరకు డిస్కంల నివేదికపై అ భ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తారు. మార్చి 5న హనుమకొండలో, మార్చి 7న హైదరాబాద్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపి, టారిఫ్‌ ఆర్డర్‌ను జారీ చేస్తుంది.

రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం 
సాక్షి. హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్రాల అవసరాలు, అవి కోరుకుంటున్న కొత్త ప్రాజెక్టులు, విధానపర నిర్ణయాల్లో మార్పులు, కేంద్రం నుంచి నిధుల విడుదలకు వస్తున్న డిమాండ్లు, వీటన్నింటిపై ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె చర్చించనున్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించే ముందు రాష్ట్రాల డిమాండ్లు, అవసరాలకు ఏ మేరకు నిధులు కేటాయించాలో ఈ సమావేశం ఆధారంగా నిర్ణయిస్తారు.  

బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు సంక్రాంతి తరువాత ప్రారంభం కానున్నాయి. అన్ని శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా వరుస భేటీలు నిర్వహించనున్నారు.   

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)