Breaking News

ఐపీఎల్‌ టికెట్ల పేరిట మోసం!

Published on Mon, 04/08/2024 - 02:00

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడంతా ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. క్రికెట్‌ అభిమానులు వారి అభిమాన జట్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు తక్కువ ధరకే ఐపీఎల్‌ టికెట్లు అంటూ సరికొత్త మోసానికి తెరతీశారు. నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లు సృష్టించి ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో సైబర్‌ నేరగాళ్ల మోసానికి చిక్కిన బెంగళూరుకు చెందిన మహిళ రూ.86 వేలు పోగొట్టుకున్నారు.

మార్చి 29న జరిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ చూసేందుకు సదరు మహిళ ఫేస్‌బుక్‌లో ‘ఐపీఎల్‌ క్రికెట్‌ టికెట్‌’ అనే అకౌంట్‌ ద్వారా టికెట్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా సైబర్‌ నేరగాళ్లు మోసగించారు. సైబర్‌ నేరగాళ్లు ఐపీఎల్‌ టికెట్ల విక్రయం పేరిట మోసగించే ప్రమాదం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు.

ఆ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి 
ఐపీఎల్‌ టికెట్లను బుక్‌ మైషోలో అధికారికంగా విక్రయిస్తున్నారు. అచ్చం బుక్‌ మై షో మాదిరిగానే సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ వెబ్‌సైట్‌లను క్రియేట్‌ చేసి నట్టు పోలీసులు గుర్తించారు. బుక్‌మై షో తరహాలో దగ్గరగా ఉండే పేర్లతో వీటిని తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే తరహాలో మోసగిస్తున్న ’book. myshow&premium.net', 'bookmyshow. cloud' అనే వెబ్‌సైట్లను పోలీసులు మూసివేయించారు. నకిలీ వెబ్‌సైట్‌లో ఎర్లీబర్డ్, స్పెషల్‌ డిస్కౌంట్, పది టికెట్లు కొంటే కొంత డిస్కౌంట్‌ ఇలా ఆఫర్లను పెడుతూ మోసగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ విధానంలోనే పేమెంట్లు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని కేసులలో సైబర్‌ నేరగాళ్లు టికెట్‌కు అయ్యే మొత్తంలో కొంత డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించి బుక్‌ చేసుకోండి..తర్వాత స్టేడియం వద్ద మిగిలిన సొమ్ము చెల్లించి టికెట్లు పొందండి అంటూ బురిడీ కొట్టిస్తున్నట్టు తెలిపారు. 

ఆ వెబ్‌సైట్‌లలోనే కొనండి
కేవలం అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే ఐపీఎల్‌ టికెట్లు కొనాలని, ఫేక్‌ వెబ్‌సైట్ల మోసాలకు గురి కా వొద్దని తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఐపీఎల్‌ సీజన్‌ ఇంకా నడుస్తున్నందున టికెట్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. టికెట్‌ కొనుగోలు చేసేందుకు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, ఏటీఎం, క్రెడిట్‌ కార్డు నంబర్లు, పిన్‌ నంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని, అది సైబర్‌ మోసంగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. సైబర్‌ మో సాలపై సైబర్‌ క్రైం పోలీసులకు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌లో లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)