Breaking News

బీజేపీతో జాగ్రత్త!

Published on Tue, 02/03/2026 - 02:07

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ గట్టి పోటీ ఇస్తోందని సర్వేలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో గెలుపు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి పని చేయాలని సూచించినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో కలిసి పని చేసిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ స్థానిక నాయకత్వాలు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సర్దుబాట్లు చేసుకోవడంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సోమవారం తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశమయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. జూమ్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎం, పీసీసీ చీఫ్‌లతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, పీఈసీ సభ్యులు డాక్టర్‌ చల్లా వంశీచందర్‌రెడ్డి, వి. హన్మంతరావు, కె.జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్, జెట్టి కుసుమకుమార్, సంపత్‌కుమార్, రాములు నాయక్, ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్‌ అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

పలు సర్వేల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా ఏ మున్సిపాలిటీలో ఎలాంటి కసరత్తు చేయాలన్న దానిపై పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీల వారీగా పరిస్థితిని మంత్రులు, పీఈసీ సభ్యులకు వివరించిన సీఎం.. ఎక్కడ ఏం చేయాలన్నది తాను వ్యక్తిగతంగా మంత్రులు, పార్టీ నేతలతో మాట్లాడతానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో సమన్వయం చేసుకోవాలని, రెబల్స్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

కాంగ్రెస్‌ సత్తా చాటాలి 
రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీలు గెలుచుకుంటామని సర్వేలు చెపుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 80–90 శాతం స్థానాల్లో కాంగ్రెస్‌ పారీ్టదే విజయం. గతంలో జరిగిన అన్ని ఎన్నికల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికలను కూడా చాలెంజ్‌గా తీసుకోవాలి. చాలాచోట్ల నాయకత్వం మధ్య పోటీ కనిపిస్తోంది. మాకంటే మాకు బీఫామ్‌లు కావాలని అడుగుతున్నారు. ఇలాంటి స్థానాల్లో అందరినీ కూర్చోబెట్టి ఏకాభిప్రాయం సాధించి ఒకరికి బీఫామ్‌ ఇచ్చేలా పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రులు చొరవ తీసుకోవాలి.

టికెట్లు రాని బలమైన నాయకులకు కార్పొరేషన్లు, ఇతర మార్గాల్లో అవకాశం కలి్పస్తామని హామీ ఇవ్వాలి. కొత్త, పాత కాంగ్రెస్‌ అనే సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో కూడా రాజీ మార్గం ద్వారా పార్టీ గెలుపునకు ప్రాధాన్యమిచ్చి అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటాలి..’అని రేవంత్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో భాగంగా పార్లమెంటు స్థానాల వారీగా ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీలు ఇచి్చన అభ్యర్థుల జాబితాను పీఈసీ ఆమోదించింది. 

ఈ మేరకు బీఫామ్‌లు ఇచ్చే అధికారాన్ని డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్‌ ఇచ్చారు. వీహెచ్‌ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు. సీఎం, పీసీసీ చీఫ్‌లు రాహుల్‌గాం«దీతో మాట్లాడి ఈ అంశంపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టేలా ఒప్పించాలని కోరారు.

సీఎంకు అభినందనలు 
సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై కూడా జూమ్‌ సమావేశంలో కొంత సేపు చర్చ జరిగింది. దావోస్‌లో తెలంగాణ రైజింగ్‌ వాయిస్‌ను సమర్థవంతంగా వినిపించగలిగామని పీఈసీ అభిప్రాయపడింది. దీంతో పాటు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో రేవంత్‌ తీసుకున్న శిక్షణ గురించి కూడా పలువురు మంత్రులు, పీఈసీ సభ్యులు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థిగా పాఠాలు నేర్చుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఇలావుండగా..సీఎం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రులతో సమావేశం కానున్నారు. మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌లు హాజరు కానున్నారు.   

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు