Breaking News

జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్‌

Published on Wed, 05/26/2021 - 17:04

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సీనియర్‌ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచేందుకు.. మూడేళ్లు వైద్య విద్య అభ్యసించి కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య విద్యార్థులకూ ఈ వేతనాన్ని వర్తింపజేసేందుకు సీఎం ఓకే చెప్పారు. కోవిడ్‌ విధుల్లో మరణించిన వైద్యులకు అందిస్తున్న ఎక్స్‌గ్రేషియాను సత్వరమే చెల్లించాలని.. జూనియర్‌ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు జూనియర్‌ డాక్టర్ల సమ్మె విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చాలా రాష్ట్రాల్లో జూనియర్‌ డాక్టర్లకు తెలంగాణ కంటే తక్కువ స్టైపెండ్‌ చెల్లిస్తున్నారని వివరించారు. దీంతో జూనియర్‌ డాక్టర్ల సమస్యలు ఏమిటని సీఎం ఆరా తీశారు. ఆయా అంశాలను అధికారులు వివరించగా.. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. జూనియర్‌ డాక్టర్ల పట్ల ప్రభుత్వం ఎన్నడూ వివక్ష చూపలేదని, వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు. 

సమ్మెను ప్రజలు హర్షించరు 
విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచు కుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ‘‘జూనియర్‌ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. అంతేగానీ.. చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయ సందర్భాలను కూడా చూడకుండా, విధులను బహిష్కరించడం సరైన పద్ధతి కాదు. అదికూడా కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు’’అని స్పష్టం చేశారు. 

చదవండి: జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందన
సమర్థవంతంగా లాక్‌డౌన్‌ అమలు: సీపీ అంజనీకుమార్‌

Videos

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

Photos

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)