Breaking News

రైతు భరోసా కోసం తనిఖీలు

Published on Sat, 01/04/2025 - 01:30

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’(Rythu Bharosa) అందించే విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వ్యవసాయేతర భూములకు పెట్టుబడి సాయం అందించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని.. ఈ విషయంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలసి క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలను చేపట్టాలని సిఫారసు చేసింది. గురువారం జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ(Cabinet sub committee) సమావేశంలో ఈ మేరకు ఆరు సిఫారసులను ఆమోదించింది. 

‘రైతు భరోసా’పై సబ్‌ కమిటీ చేసిన సిఫారసులివే.. 
పంటలు పండించే భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలి. తోటలు పెంచే భూములకు వానాకాలం లేదా యాసంగిలో ఒక్క సీజన్‌లో మాత్రమే సాయం ఇవ్వాలి. ఏ భూమికి కూడా ఏడాదికి రెండుసార్లకు మించి సాయం అందించకూడదు. 

⇒ ప్రతి సీజన్‌కు ముందు రైతులు సాగు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ యాప్‌ లేదా ప్రజాపాలన కేంద్రాల్లో రైతులు ఇచ్చే ఈ ధ్రువీకరణలను శాటిలైట్, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా నిర్ధారించాలి. 

⇒ ఈ ఏడాది యాసంగి సీజన్‌లో పంటల సాగును శాటిలైట్‌ చిత్రాల ద్వారా నిక్షిప్తం చేయాలి. 

⇒ రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు డిజిటల్‌ రికార్డులను అప్‌డేట్‌ చేసేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పలు శాఖలకు చెందిన గ్రామస్థాయి అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలి.  

⇒ సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలి. కొండలు, రోడ్లు, రాళ్లు ఉండే భూములు, భౌగోళికంగా సాగుకు అనర్హమైన భూములను గుర్తించాలి. ఆర్‌వోఆర్‌ డేటాలో వ్యవసాయ భూములుగా ఉండి నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను వేరు చేయాలి.  

⇒ రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి భౌగోళికంగా వ్యవసాయానికి పనికిరాని భూములను, వ్యవసాయేతర అవసరాలకు జరిగిన మార్పిడిని గుర్తించాలి. ఈ భూములకు రైతు భరోసా వర్తింపజేయకూడదు. 

⇒  మాజీ, తాజా ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబాలకు, ఐటీ చెల్లింపుదారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయకూడదు. వీరిని గుర్తించేందుకు ఆహార భద్రత కార్డులు, 2024లో నిర్వహించిన కులగణనను ప్రాతిపదికగా తీసుకోవాలి. అయితే ఈ మినహాయింపును రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు వర్తింపచేయాలి. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)