Breaking News

భారత క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం..! నలుగురిపై వేటు

Published on Sat, 12/13/2025 - 11:01

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అస్సాంకు చెందిన నలుగురు ఆట‌గాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఆ న‌లుగురు ప్లేయ‌ర్ల‌ను అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకుర్‌ల‌గా అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) గుర్తించింది.

దీంతో వారిపై ఏసీఎ  సస్పెన్ష‌న్ వేటు వేసింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన లీగ్ మ్యాచ్‌ల‌లో ఈ న‌లుగురు.. స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌ను ప్రభావితం చేసేందుకు ప్ర‌య‌త్నించారంట‌. ఈ విష‌యాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్య‌ద‌ర్శి సనాతన్ దాస్  ధ్రువీక‌రించారు. 

దర్యాప్తు పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఈ న‌లుగురిపై గువ‌హతిలోని  క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా న‌మైంది. ఈ విష‌యంపై బీసీసీఐ అవినీతి నిరోధ‌క విభాగం ఇప్ప‌టికే ప్రాథమిక విచారణ చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. 

సస్పెండ్ అయిన వారిలో అభిషేక్ ఠాకూర్.. ఈ ఏడాది రంజీ సీజ‌న్‌లో అస్సాం త‌ర‌పున రెండు మ్యాచ్‌లు ఆడారు. మిగితా ప్లేయ‌ర్లు దేశీయ క్రికెట్‌లో వివిధ స్థాయిల్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ సైతం అస్సాంకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: మెస్సీ కోసం హానీమూన్ మానుకున్న జంట‌

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)