Breaking News

'గబ్బా' రిపీట్‌ అయ్యేనా! ఫాలోఆన్‌ తప్పినా ఓటమి పొంచే ఉంది!

Published on Fri, 06/09/2023 - 22:54

ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య ఓవల్‌ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ముగిసింది. తొలి రెండు రోజులు ఆసీస్‌ ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడోరోజు ఆటలో మాత్రం టీమిండియా రెండు సెషన్లలో ఆసీస్‌పై చేయి సాధించింది. తొలి సెషన్‌లో అజింక్యా రహానే, శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుత పోరాటంతో టీమిండియా ఫాలోఆన్‌ గండం నుంచి బయటపడింది. మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే 5 పరుగులు చేసిన కేఎస్‌ భరత్‌ ఔట్‌ అయ్యాడు.

దీంతో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. అప్పటికి టీమిండియా స్కోరు 151 మాత్రమే. ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే  మరో 100 పరుగులు చేయాల్సిన దశలో రహానే, శార్దూల్‌ అద్బుతం చేశారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు ఔటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్‌ ఎక్కువసేపు నిలబడలేదు. దీంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయావకాశాలు ఎక్కువగా ఆసీస్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ కలుపుకొని ఇప్పటివరకు ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యం సాధించింది. ఒకవేళ నాలుగు రోజు ఆటలో లంచ్‌లోపే ఆసీస్‌ ఆలౌట్‌ చేయకపోతే వారి ఆధిక్యం 350 నుంచి 400 వరకు ఉండే అవకాశం ఉంటుంది.

ఆటకు ఇంకా రెండు రోజులు ఉండడంతో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాలుగు, ఐదు రోజుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన టీమిండియా టాపార్డర్‌, మిడిలార్డర్‌  నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఓటమి తప్పకపోవచ్చు.

గబ్బా రిపీట్‌ అయ్యేనా?
అయితే 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో రహానే నేతృత్వంలో గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇలాంటి పరిస్థితిలోనే చారిత్రక విజయాన్ని సాధించింది.  ఆసీస్‌ విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. అప్పటి మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ 89 నాటౌట్‌, శుబ్‌మన్‌ గిల్‌ 91 పరుగులు, పుజారా 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రస్తుతం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో  నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగు రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించి తొలి సెషన్‌లో తక్కువ వ్యవధిలో(అంటే మరో 40 పరుగులు) ఆసీస్‌ను ఆలౌట్‌ చేయగలిగితే టీమిండియా లక్ష్యం 330 నుంచి 340 మధ్య ఉంటుంది.

ఆటకు రోజున్నర సమయం ఉండడంతో కాస్త నిలకడగా ఆడితే టీమిండియా విజయం అందుకోవడంతో పాటు టైటిల్‌ నెగ్గే అవకాశం ఉంది. మరి టీమిండియా ఆసీస్‌ను ఆలౌట్‌ చేసి చేధనలో టార్గెట్‌ను అందుకుంటుందా లేక మరోసారి రన్నరప్‌గా నిలుస్తుందా అనేది రేపటితో తేలిపోనుంది.

చదవండి: #ShubmanGill: లవ్‌ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్‌ మిస్‌ చేశాడు!

512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)