Breaking News

భారత్‌కు మరో పతకం; ఆర్చరీలో పతకం సాధించిన తొలి పారా అథ్లెట్‌గా

Published on Fri, 09/03/2021 - 19:01

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో హర్వీందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. కొరియాకు చెందిన పారా అథ్లెట్‌ కిమ్‌ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో 6-5 తేడాతో ఓడించిన హర్వీందర్‌ సింగ్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక పారాలింపిక్స్‌లో ఆర్యరీ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా హర్వీందర్‌ చరిత్ర సృష్టించాడు. హర్వీందర్‌ సింగ్‌ సాధించిన పతకంతో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చేరుకుంది.

ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా.. శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్‌లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా అవనీ లేఖరా సరికొత్త చరిత్ర సృష్టించింది.

చదవండి: Tokyo Paralympics: సాహో జెంగ్‌ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు

Avani Lekhara: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం

Videos

టెంట్ పీకేసి.. ఉద్యమకారులపై కూటమి కుట్ర

కొమ్మినేని అక్రమ అరెస్ట్ పై సంచలన ప్రెస్ మీట్

కొమ్మినేని అరెస్ట్ ను ఖండిస్తున్నాం: అనంత వెంకట్రామిరెడ్డి

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అక్రమ అరెస్ట్ ను ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు

కొమ్మినేనిపై SC, ST కేసు ఎలా పెడతారు? అక్రమ అరెస్ట్ పై సీనియర్ జర్నలిస్టుల ప్రశ్న

స్పిరిట్ పోతేనేం.. బన్నీ పక్కన బంపరాఫర్ కొట్టేసిందిగా..!

కొమ్మినేని అక్రమ అరెస్ట్ పై కన్నబాబు రియాక్షన్

సాక్షి రిపోర్టర్ ప్రశ్నలకు తెల్లమొహం వేసిన ఏపీ పోలీసులు

ముంబై లోకల్ ట్రైన్ లో రద్దీ.. ఐదుగురు మృతి

నేనంటే చంద్రబాబుకు పగ.. అందుకే ఈ కక్ష సాధింపు

Photos

+5

పెళ్లిరోజు సెలబ్రేట్‌ చేసుకున్న నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ (ఫోటోలు)

+5

యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం (ఫొటోలు)

+5

ఎంపీతో క్రికెటర్‌ రింకూ సింగ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)

+5

మిస్‌ యూనివర్స్‌ 2025 పోటీలకు మన తెలుగు తేజాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా అఖిల్‌- జైనాబ్ రిసెప్షన్‌ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : చేప మందు పంపిణీ.. పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)

+5

అఖిల్‌ అక్కినేని సతీమణి 'జైనబ్‌' ఫోటోషూట్‌ లుక్స్‌ చూశారా..? (ఫొటోలు)