Breaking News

శీతల్‌ దేవి శుభారంభం

Published on Fri, 08/30/2024 - 02:45

పారిస్‌: పారా ఆర్చరీలో గత కొంత కాలంగా సంచలన విజయాలు సాధిస్తున్న భారత ప్లేయర్‌ శీతల్‌ దేవి పారాలింపిక్స్‌లోనూ శుభారంభం చేసింది. ఆర్చరీ కాంపౌండ్‌ ఈవెంట్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె నేరుగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ర్యాంకింగ్‌ రౌండ్‌లో శీతల్‌ రెండో స్థానంలో నిలిచింది. 

మొత్తం 703 పాయింట్లతో ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు 700 పాయింట్లు దాటిన భారత తొలి మహిళా పారా ఆర్చర్‌గా ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఈ నెలలోనే ఫోబ్‌ పేటర్సన్‌ (బ్రిటన్‌) 698 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును శీతల్‌ బద్దలు కొట్టింది. 

అయితే కొద్ది సేపటికే 704 పాయింట్లతో ఈ రికార్డును సవరిస్తూ ఒజ్‌నర్‌ క్యూర్‌ (టర్కీ) మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో శీతల్‌ 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ఆ తర్వాత పారా వరల్డ్‌ చాంపియన్‌íÙప్‌లో కూడా పతకం సాధించింది. కశీ్మర్‌కు చెందిన శీతల్‌ పుట్టుకతోనే ‘ఫొకెమెలియా సిండ్రోమ్‌’ వ్యాధి బారిన పడటంతో ఆమె రెండు చేతులూ పని చేయకుండా ఉండిపోయాయి. 
 
సుకాంత్, సుహాస్, తరుణ్‌ ముందంజ... 
బ్యాడ్మింటన్‌ పోటీల్లో తొలి రోజు భారత్‌ మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్‌కు చెందిన సుకాంత్‌ కదమ్, సుహాస్‌ యతిరాజ్, తరుణ్‌ గ్రూప్‌ దశలో తమ మొదటి రౌండ్‌లలో విజయాలు అందుకున్నారు. సుకాంత్‌ 17–21, 21–15, 22–20తో మొహమ్మద్‌ అమీన్‌ (మలేసియా)పై, సుహాస్‌ 21–7, 21–5తో హిక్మత్‌ రమ్‌దాని (ఇండోనేసియా)పై, తరుణ్‌ 21–17, 21–19తో ఒలీవిరా రోజరియో (బ్రెజిల్‌)పై గెలుపొందారు. 

అయితే మరో ఇద్దరు షట్లర్లు మన్‌దీప్‌ కౌర్, మానసి జోషిలకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మానసి 21–16, 13–21, 18–21తో ఇక్తియార్‌ (ఇండోనేసియా) చేతిలో, మన్‌దీప్‌ 8–21, 14–21తో మరియమ్‌ బొలాజి (నైజీరియా) చేతిలో పరాజయంపాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో నితీశ్‌ కుమార్‌–తులసిమతి 21–14, 21–17తో భారత్‌కే చెందిన సుహాస్‌ యతిరాజ్‌–పలక్‌ కోహ్లిలను ఓడించి ముందంజ వేయగా... శివరాజన్‌–నిత్యశ్రీ ద్వయం 21–23, 11–21తో మైల్స్‌ క్రాజెస్కీ–జేసీ సైమన్‌ (అమెరికా) చేతిలో ఓడారు. 

తైక్వాండో భారత ప్లేయర్‌ అరుణ తన్వర్‌ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో టరీ్కకి చెందిన నూర్సిహన్‌ ఎకిన్సీ 19–0తో అరుణను చిత్తుగా ఓడించింది. సైక్లింగ్‌ 3000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన జ్యోతి గడేరియా 10వ స్థానంలో నిలిచి ని్రష్కమించింది. జ్యోతి ఈ రేస్‌ను 4 నిమిషాల 53.929 సెకన్లలో ముగించింది.  

Videos

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

బాబు.. సిద్ధంగా ఉండు.. జగన్ గెలుపు ఖాయం..

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)