Breaking News

చెన్నై ఓపెన్‌ పునరాగమనం

Published on Tue, 06/17/2025 - 09:28

చెన్నై: తమిళనాడు టెన్నిస్‌ అసోసియేషన్‌ (టీఎన్‌టీఏ) అధ్యక్షుడు, భారత మేటి ప్లేయర్‌ విజయ్‌ అమృత్‌రాజ్‌ కృషి ఫలించింది. మూడేళ్ల తర్వాత చెన్నై ఓపెన్‌ భారత టెన్నిస్‌లో పునరాగమనం చేయనుంది. ఈ అక్టోబర్‌లో టోర్నీ నిర్వహణకు మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 27 నుంచి మెయిన్‌ డ్రా పోటీలు జరుగుతాయని టీఎన్‌టీఏ అధ్యక్షుడు విజయ్‌ అమృత్‌రాజ్‌ తెలిపారు. ‘మొత్తానికి మా ప్రయత్నాలు ఫలించాయి. చెన్నైలో మేటి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి మార్గం సుగమమైంది. 

ఈ టోర్నీని తిరిగి నగరంలో నిర్వహించాలనే మా ప్రయత్నాలకు మొదటి నుంచి వెన్నంటే ఉండి సహకరించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడు స్పోర్ట్స్‌ అథారిటీకి కృతజ్ఞతలు’ అని విజయ్‌ అన్నారు. ప్రముఖ స్పోర్ట్స్‌ చానెల్‌ నెట్‌వర్క్‌ ఈ టోర్నీ మ్యాచ్‌లను ప్రసారం చేస్తుందన్నారు. చెన్నై అభిమానులు, భారత టెన్నిస్‌ ప్రియులు ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చివరి సారిగా చెన్నై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–250 టోర్నమెంట్‌ను 2022లో నిర్వహించారు. చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ లిండా ఫ్రువిత్రొవా సింగిల్స్‌ 
చాంపియన్‌గా నిలిచింది.   

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)