Breaking News

2032 తర్వాత ‘గాబా’ కనుమరుగు

Published on Wed, 03/26/2025 - 04:00

బ్రిస్బేన్‌: ఆ్రస్టేలియాలోని ప్రఖ్యాత క్రికెట్‌ స్టేడియం ‘గాబా’ కనుమరుగు కానుంది. సుదీర్ఘకాలంగా ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానాన్ని 2032 ఒలింపిక్స్‌ తర్వాత కూల్చివేయనున్నారు. 2028 ఒలింపిక్స్‌కు లాస్‌ ఏంజెలిస్‌ ఆతిథ్యమిస్తుండగా... మరో నాలుగేళ్ల తర్వాత బ్రిస్బేన్‌ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. దాని కోసం ఆ్రస్టేలియా ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా... క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం వేదికలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. 

ఒలింపిక్స్‌ కోసం విక్టోరియా పార్క్‌లో 63 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో కూడిన నూతన అధునాతన స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులోనే ఒలింపిక్స్‌ ఆరంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. విశ్వక్రీడలు ముగిసిన అనంతరం ‘గాబా’ మైదానాన్ని పూర్తిగా పడగొట్టి ఒలింపిక్స్‌ కోసం నిర్మించిన కొత్త స్టేడియంలోనే క్రికెట్‌ మ్యాచ్‌లు జరపనున్నారు. 

ఒకవేళ 2032 ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ మెడల్‌ ఈవెంట్‌గా కొనసాగితే క్రికెట్‌ ఈవెంట్‌ స్వర్ణ పతక పోరుకు మాత్రం పాత ‘గాబా’ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. ‘గాబా స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో మరపురాని మ్యాచ్‌లు జరిగాయి. ఆటగాళ్లకు, అభిమానులకు ఈ మైదానంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.

అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మైదానాన్ని కూల్చివేయనున్నారు. దీని స్థానంలో క్వీన్స్‌ల్యాండ్‌లో మరో కొత్త స్టేడియం సిద్ధమవుతుంది. అందులో ఐసీసీ ఈవెంట్‌లు, యాషెస్‌ సిరీస్, ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లు యధావిధిగా జరుగుతాయి’ అని క్వీన్స్‌ల్యాండ్‌ క్రికెట్‌ సీఈవో టెర్రీ స్వెన్సన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

» 1931 నుంచి టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ‘గాబా’ స్టేడియంలో ఇప్పటి వరకు 67 పురుషుల టెస్టు మ్యాచ్‌లు, 2 మహిళల టెస్టులు జరిగాయి.  
»పేస్‌కు పెట్టింది పేరైన ‘గాబా’ పిచ్‌పై ఆ్రస్టేలియా జట్టు 1988 నుంచి 2021 వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఓడలేదు. 2020–21 పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది.  
»2032 ఒలింపిక్స్‌ ప్రణాళికల్లో భాగంగా ‘గాబా’ మైదానాన్ని ఆధునీకికరించాలని తొలుత భావించారు. అయితే అధిక వ్యయం కారణంతో ఆ ప్రణాళికను పక్కన పెట్టి పార్క్‌ల్యాండ్‌ ఇన్నర్‌ సిటీలో కొత్త స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు.  
»ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న సమయంలో ‘గాబా’ మైదానాన్ని మరింత మెరుగు పరచాలని భావించినా... ఇప్పటికి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.  
»విశ్వక్రీడలకు మరో ఏడేళ్ల సమయమే ఉండటంతో కొత్త స్టేడియం నిర్మాణానికే మొగ్గుచూపారు.  
»ఇటీవల ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన క్రిస్టీ కొవెంట్రీ ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండటంతో... ఆ్రస్టేలియా ప్రభుత్వం వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.

Videos

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

MLA మత్సరాస విశ్వేశ్వరరాజుపై పోలీసుల ఓవర్ యాక్షన్

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..బీజేపీ Vs కాంగ్రెస్

రాజ్ కేసిరెడ్డి కేసులో SITపై సుప్రీం సీరియస్

Viral : నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు సొమ్ము! ఎం చేసారంటే

సంచలన సర్వే రిపోర్ట్ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయం..!

Photos

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)