Breaking News

పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెట‌ర్ల మృతి

Published on Sat, 10/18/2025 - 07:26

అఫ్గానిస్తాన్ క్రికెట్‌(Afghanistan) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాక్ సరిహద్దులోని తూర్పు పాక్తిక ప్రావిన్స్‌లో పాకిస్తాన్(Pakistan) సైన్యం జ‌రిపిన బాంబు దాడిలో ముగ్గురు అఫ్గాన్‌ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు.  ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించింది.

అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకారం.. ఆటగాళ్లు తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుండి షరానాకు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతి చెందిన క్రికెటర్లను కబీర్‌, సిబాతుల్లా, హరూన్‌గా గుర్తించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాక్ సైనం కృరత్వానికి వారు బలై అయిపోయారు.

ఈ దాడిలో క్రికెటర్లతో మరో ఐదుగురు అఫ్గాన్‌ పౌరులు సైతం ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కారణంగా నవంబర్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌తో జరిగాల్సిన  ట్రై సిరీస్‌ నుంచి అఫ్గానిస్తాన్‌ తప్పుకొంది.

"ఈ హృదయ విదారక ఘటనలో ఉర్గున్ జిల్లాకు చెందిన మా ముగ్గురు ఆటగాళ్లు కబీర్‌, సిబ్ఘతుల్లా, హరూన్‌లను కోల్పోయాము. ఉర్గున్ కు తిరిగి వచ్చాక ఓ సమావేశంలో ఈ దాడి జరిగింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికి పంద చర్య. మా క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులు మృతి చెందారు. 

వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. బాధితులకు గౌరవ సూచకంగా నవంబర్ చివరలో జరగనున్న పాకిస్తాన్‌తో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుండి వైదొలగాల‌ని నిర్ణ‌యించుకున్నాము అని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా అక్టోబర్ 11 నుంచి పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా..  ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం  ఔట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో దాడి చేశారు. 

ఇరువైపుల కూడా  పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే పాక్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)