Breaking News

‘ఎన్ని విమర్శలు, వెటకారాలు చేసినా కాంగ్రెస్‌కే పట్టం కట్టారు’

Published on Fri, 02/13/2026 - 19:37

నిజామాబాద్:  తమ పార్టీపై ఎన్నో విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయని, అదే ఇంతటి ఘన విజయానికి కారణమైంద్నార.  మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నిజమాబాబ్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ గెలిపించారు. మంత్రులు, నేతలు, కార్యకర్తల కృషితో 70 శాతం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం. ఎన్ని విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు కాంగ్రెస్‌ని ఆదరించారు. 75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇంకా అన్ని పార్టీలు కలిసి కనీసం 25 శాతం కూడా గెలవలేదు. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీ, ఎంఐఎంలు లబ్ధిపొందాయి. సీఎం రేవంత్‌, మంత్రులు, ప్రజల కోరికలను నెరవేర్చేలా పాలిస్తున్నారు. సన్నబియ్యం, ఉచిత బస్సు, విద్యుత్‌ వంటి పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యాయి. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం. రానున్న రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)