Breaking News

ఫ్లెక్సీల్లో ఫొటోలు కాదు.. ఇంటింటికీ వెళ్లాలి! 

Published on Thu, 01/12/2023 - 07:02

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గోడల మీద నేతల పేర్లు, ఫ్లెక్సీల్లో ఫొటోలు కాదు.. కమలం గుర్తును ఇంటింటికీ తీసుకెళ్లాలి. బీజేపీ ఎన్నికల గుర్తును ప్రజల్లో ప్రచారం చేయాలి. సొంతంగా దండలు, పార్టీ కండువాలు వేసుకుని వచ్చేవారు నాయకులు కాదు. పార్టీ ఎవరికి దండ వేస్తుందో వారే లీడర్లు..’’ అని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ స్పష్టం చేశారు. 

ఎవరో పెద్ద నాయకుడో, ఎంపీనో, ఎమ్మెల్యేనో వస్తారని వేచి చూడకుండా.. షెడ్యూల్‌ ప్రకారం మండల అధ్యక్షులే పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుకు వెళ్లాలని సూచించారు. అసెంబ్లీ కేంద్రంగా కాకుండా మండలాలు కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్‌ర్యాలీలు సాగిన తీరుతోపాటు మేడ్చల్‌ జిల్లాలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై సునీల్‌ బన్సల్‌ బుధవారం సమీక్షించారు. దీనితోపాటు రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకు నియమితులైన పార్లమెంట్‌ కన్వీనర్, ప్రభారీ, విస్తారక్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 29న ప్రధాని మన్‌కీబాత్‌ కార్యక్రమాన్ని మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని సగం పోలింగ్‌ బూత్‌లలో నిర్వహించాలన్నారు.

31లోగా బూత్‌ కమిటీల నియామకం.. 
‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ కార్యక్రమానికి పెద్ద లీడర్లు సరిగా రావడం లేదని, కేటాయించిన నియోజకవర్గాల్లో పూర్తి సమయం ఉండటం లేదని కొందరు తన దృష్టికి తీసుకురావడాన్ని సునీల్‌ బన్సల్‌ ప్రస్తావించినట్టు తెలిసింది. ‘‘ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే లక్ష్యం. ఎవరైనా సీనియర్‌ నాయకుడు రాకపోతే పార్టీ మండలాధ్యక్షుడే లీడర్‌. ఆ రోజు మండలంలో జరగాల్సిన కార్యక్రమాన్ని యధాతథంగా పూర్తిచేయాలి. నిర్దేశిత కార్యక్రమం మేరకు అన్ని మండలాల్లో బైక్‌ ర్యాలీలు పూర్తి చేయాలి. కార్యకర్తలు స్వచ్ఛందంగా బైక్‌ పెట్రోల్, ఇతర ఖర్చులు పెట్టుకుని కార్యక్రమం చేపట్టేలా చూడాలి. పార్టీ నాయకత్వం నిర్ణయించిన కార్యక్రమానికి ఎవరూ అడ్డుచెప్పే ప్రశ్నే ఉత్పన్నం కాదు..’’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. 

అంతేగాకుండా లోక్‌సభ నియోజకవర్గాల్లోనో, ఏదైనా నిర్ణయించిన కార్యక్రమంలోనో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాకపోయినా సరే.. ఈనెల 31లోపు అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ కమిటీల నియామకం పూర్తి చేయాలని సూచించినట్టు తెలిసింది. లోక్‌సభ విస్తారక్‌లు, ఇతర నేతల సమావేశంలో నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, చింతల రామచంద్రారెడ్డి, ఎనీ్వఎస్‌ఎస్‌ ›ప్రభాకర్, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

#

Tags : 1

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)