Breaking News

‘చంద్రబాబు ఆంధ్రుల ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్నారు’

Published on Sun, 11/16/2025 - 17:11

విశాఖపట్నం:  చంద్రబాబు ఆంధ్రుల ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్నారని :మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తమ లక్ష్యమని చంద్రబాబు తేల్చేశారని,  సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ఈ మేరకు రాజన్నదొర, సీదిరి అప్పలరాజులు సంయుక్త ప్రకటనలో ఏమన్నారంటే..

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా, నాటి సీఎం వైఎస్‌ జగన్‌ అడ్డుకున్నారు. అప్పుడు విపక్షంలో ఉన్న సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. నాటి ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేక పోతోందని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యూటర్న్‌ తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ, ఒకవైపు ప్రజలను మభ్య పెడుతూ, మరోవైపు ఆ దిశలో కేంద్ర చర్యలను పూర్తిగా సమర్థిస్తున్నారు. అందుకు నిన్నటి (శనివారం) చంద్రబాబు మాటలే నిదర్శనం.

 ‘పని చేయకున్నా జీతాలివ్వాలా? తెల్ల ఏనుగులా మారితే ఎలా? ఎన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి? ఊర్కే జీతాలు ఎందుకిస్తాయి?’ అనడం.. సీఎం చంద్రబాబు దిగజారిన వైఖరికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసినట్లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను కూడా దారుణంగా వంచించారు. నిలువుగా దగా చేశారు.

అదే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొన్నాళ్ల క్రితం కేంద్రం ప్యాకేజీ ఇస్తే, అది తమ ఘనత అన్నట్లు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని, తమ చొరవ వల్లే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని డబ్బా కొట్టుకున్నారు. నిజానికి కేంద్రం ఆ నిధులు ఇచ్చింది స్టీల్‌ ప్లాంట్‌ను గట్టెక్కించడానికా? లేక ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకా? అన్నది చూస్తే.. రెండోదే ఖాయంగా తేలుతోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడడంలో సీఎం చంద్రబాబు ఇసుమంతైనా చొరవ చూపడం లేదు. పైగా తన సిద్ధాంతమైన ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. అయినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్లీ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

తమ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా చంద్రబాబు కానీ, పవన్‌కళ్యాణ్‌ కానీ నోరు మెదపడం లేదు. కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. పరోక్షంగా లక్షలాదిపై ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తీపి తీపి మాటలతో నమ్మించిన కూటమి నేతలు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో రాష్ట్రప్రజలను నిండా ముంచేశారు. కేంద్రంతో కలసి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కళ్ల ఎదుటే ఉరి తీస్తున్నారు. 

32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను ఏకపక్షంగా ప్రైవేటీకరిస్తున్నా కిక్కురుమనడం లేదు. కేంద్ర నిర్ణయాన్ని అపే సంఖ్యా బలం ఉన్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇందుకా ప్రజలు మీకు ఈ స్థాయిలో ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించింది.

గత ప్రభుత్వ హయాంలో సీఎం శ్రీవైఎస్‌ జగన్, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను బలంగా వ్యతిరేకించినందునే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఏడాదిలోపే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు వేస్తూ వచ్చింది. ఉద్యోగుల తొలగింపు మొదలుకుని అనేక నిర్ణయాలను తీసుకున్నా చంద్రబాబు సర్కారు కిమ్మనలేదు.  ఇకనైనా టీడీపీ కూటమి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు