Breaking News

సారథి కావలెను: టీఆర్‌ఎస్‌ అధిష్టానం రహస్య సర్వే!

Published on Wed, 09/01/2021 - 11:17

సాక్షి, మహబూబాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. పార్టీలో మూడు వర్గాలు, నాలుగు గ్రూపులుగా ఉన్న నాయకులను ఒకే తాటిపై తెచ్చి అందరిని సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించే నాయకుడి అవసరం అనివార్యమైంది. అయితే ప్రస్తుతం పార్టీలో వర్గాల వారీగా ఎవరికీ వారు తమ అనుచరుల పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, వారిని పార్టీ అధినేత వద్దకు తీసుకెళ్లి పరిచయం చేయించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.

అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని నడిపించేందుకు అంగ, ఆర్థికబలం ఉన్న నాయకుడి కోసం పార్టీ అన్వేషిస్తుందని సమాచారం. కావునా నాయకులు చెప్పిన వారినే కాకుండా జిల్లాలోని మంచి నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ రహస్యంగా సర్వే చేయించి నివేదిక తెప్పించే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇలా మరి కొద్దిరోజుల్లో భర్తీ కానున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడి పీఠం ఎవరికి దక్కుతుందో.. ఏ వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా నాయకుడు అవుతాడో అనేది చర్చగా మారింది. 

ఎవరికి వారుగా ప్రతిపాదనలు
టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడి పదవి తమ అనుచరులకు దక్కించుకునేందుకు జిల్లా నేతలు పోటీ పడుతున్నట్లు కన్పిస్తోంది. జిల్లా కేంద్రంలో ప్రభావితం చేసే నాయకుడు మహబూబాబాద్‌ నుంచి ఉంటే బాగుంటుందనే ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ తమ అనుచరుల పేర్లను ఇప్పటికే అధిష్టానానికి సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం.

ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌ రెడ్డి, మార్నేని వెంకన్న పేర్లు ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నట్లు ప్రచారం. అయితే పాల్వాయి రాంమోహన్‌రెడ్డి ఇందుకు సుముఖంగా లేడనే వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మానుకోట పార్లమెంట్‌ సభ్యురాలు మాలోత్‌ కవిత కూడా తమ అనుచరుడికి పీఠం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగానే మహబూబాబాద్‌ మండలానికి చెందిన కేఎస్‌ఎన్‌రెడ్డి, ముత్యం వెంకన్న పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం. కేఎస్‌ఎన్‌ రెడ్డిని పార్టీ వర్కింగింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారని తెలిసింది. అదేవిధంగా డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అనుచరులైన గుడిపూడి నవీన్‌రావు, రాంసహాయం రంగారెడ్డి పేర్లు కూడా జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెలిసింది. మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా తమ అనుచర వర్గంలోని నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం.

కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, కొమ్మినేని రవీందర్‌ పేర్లు పరిశీలించి పార్టీ అధిష్టానానికి పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మంత్రి వర్గీయుల్లో చర్చ. ఇదిలా ఉండగా జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన బీరవెల్లి భరత్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పేర్లు కూడా జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు మహబూబాబాద్‌ పట్టణం తర్వాత రెండో పెద్ద పట్టణమైన తొర్రూరు కూడా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇందుకోసం తొర్రూరు ప్రాంతం నుంచి డాక్టర్‌ పోనుగోటి సోమేశ్వర్‌రావుకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నట్లు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు చెబుతున్నారు. 

సమన్వయంతో పనిచేసే వారికే..
టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నేతలు గ్రూపులుగా విడిపోవడంతో  పార్టీ అధ్యక్ష పదవి ముళ్ల కిరీటంలా మారింది. అందరిని ఏకతాటిపైకి తీసుకురావడమంటే కత్తిమీద సాములాంటిదే. ఈ క్రమంలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీని నడిపించే సమర్థుడి కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. కాగా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జిల్లాపై పట్టు ఉండి అందరితో కలిసిపోయి క్యాడర్‌లో కొత్త జోష్‌ తీసుకొచ్చే నాయకుడు కావాలి.

ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానిని కట్టడి చేస్తూ కొత్త క్యాడర్‌ను పార్టీలోకి తీసుకునేలా ఎత్తుగడలు వేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది పార్టీని నడిపించాలంటే ఆర్థిక పరిపుష్టి కూడా కీలకంగా పరిగణిస్తున్నారు. ఇన్ని లక్షణాలు ఉన్న నాయకుడి కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు వేచిచూస్తున్నారు. 

చదవండి: హుజూరాబాద్‌ ఉపఎన్నిక: కాంగ్రెస్‌ నుంచి ఈ పరిణామం ఉహించలేదు

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)