Breaking News

'ఎన్నో దేవాలయాలు కూలగొట్టిన ఘనత వాళ్లది.. నిర్మించిన ఘనత మాది'

Published on Tue, 08/30/2022 - 13:54

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటైందని తెలిపారు. గతంలో ధార్మిక పరిషత్ ఏర్పాటులో నిర్లక్ష్యం చేయడంతో పాటు తక్కువ చేసి మాట్లాడారన్నారు. వినాయక చవితి సందర్భంగా వారం రోజులుగా  ప్రతిపక్షాలు పనికట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేని చంద్రబాబు, బీజేపీ ఈ రోజు చవితి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఎన్నిసార్లు ఆ ధర్మాన్ని ఎన్నిసార్లు అవహేళన చేసారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజు విమర్శలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆ 23 స్థానాలు కూడా దక్కించుకోవడం కష్టమనే ఆవేదనలో చంద్రబాబు ఉన్నాడు. బీజేపీ, జనసేన, టీడీపీలు తస్మాత్ జాగ్రత్త. బీజేపీలో టీడీపీ బీజేపీ, బీజేపీ అనే రెండు వర్గాలు ఉన్నాయి. పవన్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. అప్పటి వరకు పవన్‌ని ప్రజలు నమ్మరు.. గౌరవించరు. ఎన్నో దేవాలయాలను కూలగొట్టిన ఘనత వాళ్లదైతే మా నాయకుడు నిర్మాణాలు చేస్తున్నారు. వినాయక చవితిపై ఎటువంటి ఆంక్షలు లేవని ప్రజలు గమనించాలని'' కోరారు.

చదవండి: (Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా)

'మొదటి నుంచీ ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నీతిమాలిన, దిగజారి పోయిన చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చు.. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా అపశృతి జరగకూడదు అని పోలీస్ శాఖ వివరాలు కోరుతుంది. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉంది.. కొత్త విషయం కాదు. కనీస విద్యుత్ చార్జీని రూ.1000 నుంచి సీఎం రూ.500కి తగ్గించారు. అయినా సరే అవేమీ పట్టనట్లు రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు. ఒక సున్నితమైన అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో బుద్ది చెప్తారని' ఎమ్మెల్యే కోన రఘుపతి హెచ్చరించారు. 

చదవండి: (ప్రత్యామ్నాయాలపై కేంద్రం చెప్పడం లేదు)

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)