Breaking News

ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు

Published on Thu, 10/27/2022 - 03:39

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఈనాడు రామోజీరావుకు ఉద్దానంపై ప్రేమ లేదని, విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందేమోనన్న ఏడుపు మాత్రమే వారిలో కనిపిస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు అన్యాయమంటూ ఈనాడు రాస్తున్నదంతా విష ప్రచారమేనని అన్నారు.

అందులో భాగంగానే ఉద్దానంపైనా అసత్య కథనం రాశారని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దానంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇక్కడ రక్షిత మంచినీటి ప్రాజెక్టు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారని, పలు చోట్ల డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. కిడ్నీ వ్యాధి వ్యాపించకుండా చర్యలు చేపట్టారన్నారు.

ఇవన్నీ కళ్లెదుట కనిపిస్తున్నా, అసలక్కడ ఏ కార్యక్రమమూ జరగడంలేదన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు అబద్ధపు రాతలు రాస్తున్నారని అన్నారు. అసలు చంద్రబాబు హయాంలో ఉద్దానం ప్రజలను కబళిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు ఏమి చర్యలు చేపట్టారో చెప్పాలని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం ఒక్కటైనా చేశారా? దీనికి రామోజీరావు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఉద్దానంపై వాస్తవాలు వక్రీకరించి అంతులేని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర ఈనాడు రామోజీరావు ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఉద్యానవనంలా ఉద్దానం 
ఘన చరిత్ర ఉన్న ఉద్దానం టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా మారిందని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్దానంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, కిడ్నీ జబ్బులు నయం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపోందించారని తెలిపారు. తుపాన్‌ వల్ల కుదేలైన ఉద్దానానికి ప్రత్యేక పరిహారం అందిచారన్నారు. అక్కడ పంపిణీ చేసిన జీడి, కొబ్బరి చెట్లతో ఉద్దానం ఉద్యానవనంగా మారుతోందని అన్నారు.

వైఎస్‌ జగన్‌ 2017లో కవిటి సభలో చెప్పిన విధంగా తమ ప్రభుత్వం రాగానే అక్కడ రీసెర్చ్‌ సెంటర్, ప్రత్యేకంగా కిడ్నీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం చేసిన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒక్కటీ లేవన్నారు. ఉద్దానంలో రీసెర్చ్‌ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు  ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కేజీహెచ్‌ సెంటర్‌గా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పని చేస్తుందన్నారని, అదీ జరగలేదని చెప్పారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రత్యేకంగా స్పెషలైజ్డ్‌ నెఫ్రాలజీ యూనిట్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకే చికిత్సలో, మందుల సరఫరాలో ఎక్కడా లోపం జరగడంలేదని చెప్పారు. అయినా, ప్రజలను పక్కదోవ పట్టించేలా కథనాలు ప్రచురిస్తున్న ఈనాడును, టీడీపీని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి చెప్పారు.   

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)