AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్కు జీవిత సాఫల్య పురస్కారం
"అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు"
"కరోనా కాలంలోనూ వైఎస్ జగన్ వెలిగొండ పనులను ఆపలేదు"
శతక్కొట్టిన తిలక్ వర్మ
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్పై సుప్రీంకోర్టు సీరియస్
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్తో రాజకీయ కలకలం!
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
ఐఏఎస్కు దివ్య మిట్టల్ గుడ్బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
ఫ్రాంచైజ్ బిజినెస్పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం
Published on Wed, 11/27/2024 - 16:01
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాంచైజ్ బిజినెస్పై ఆన్లైన్ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి ఆర్థిక భద్రతకు, స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని అందించే విధంగా నాట్స్ ఈ వెబినార్కు శ్రీకారం చుట్టింది.
250 మందికి పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ టి.పి.రావు ఈ వెబినార్లో ప్రాంచైజీ బిజినెస్ పై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన వ్యాపారం ప్రాంచైజెస్ల వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం, సరైన ప్రాంతాలను, ప్రాంచెజ్ పెట్టే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయం దాగుందని టి.పి.రావు వివరించారు.
మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ప్రాంచైజ్స్లతో రిస్క్ తక్కువగా ఉంటుందని, కానీ ప్రాంచైజ్ ప్రారంభించిన తొలినాళ్లలో దాని నిర్వహణ, వ్యవస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపితే చక్కటి లాభాలు ఉంటాయని తెలిపారు. ప్రాంచైజ్స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రాంచైజస్ ఏర్పాటు తన వంతుగా చేతనైన సహకారం అందిస్తానని టి.పి. రావు వెబినార్లో పాల్గొన్న వారికి హామీ ఇచ్చారు.
సమయం, ధనం వెచ్చించి పట్టుదలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రాంచైజస్ చక్కటి మార్గమని తెలిపారు. ఈ వెబినార్కు నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. చాలా మంది ఔత్సాహికులు ప్రాంచైజ్ నిర్వహణ, ప్రాంచైజస్ బిజినెస్లో వచ్చే ఇబ్బందుల గురించి తమ సందేహాలను టి.పి.రావుని అడిగి నివృత్తి చేసుకున్నారు.
ప్రస్తుత యూఎస్ గవర్నమెంట్లోఉద్యోగుల డోలాయమాన పరిస్థితుల్లో ఇటువంటి వెబినార్స్ యువతకు ఎంతో సహాయకారకం గా ఉంటాయని నాట్స్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ చెబుతూ టి.పి.రావు ను అభినందించారు. ఆన్లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందు టి.పి.రావు,కిరణ్ మందాడిలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.
(చదవండి: డల్లాస్లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు)
#
Tags : 1