Breaking News

అర్థవంతమైన చర్చలు లేకుంటే... సభలు జీవచ్ఛవాలే!: అమిత్‌ షా

Published on Mon, 08/25/2025 - 05:39

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆకాంక్షించారు. ‘‘సభల్లో అలజడి సృష్టించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. ఇది మంచి పరిణామం కాదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటు, అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదు’’ అన్నారు. సభాపతులు తమ పనితీరుతో ఆ పదవి ఔన్నత్యం పెంచాలని పిలుపునిచ్చారు.

 ‘‘ప్రజా సమస్యలపై చర్చకు నిష్పాక్షిక వేదికగా సభలను తీర్చిదిద్దాల్సిన, వాటిలో పక్షపాతానికి తావులేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. లేదంటే సభలు జీవచ్ఛవాలతో సమానమే’’ అన్నారు. 

అఖిల భారత స్పీకర్ల సదస్సును ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రారంభించారు. స్పీకర్లు, శాసన మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను ఉద్దేశించి ప్రసంగించారు. సభల్లో అర్థవంతమైన సంవాదాలు జరగకపోతే దేశానికి తీరని నష్టమన్నారు. ‘‘చర్చలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం సహించరానిది. విపక్షాలు సంయమనం పా టించాలి. కార్యకలాపా లు సజావుగా సాగేలా సహకరించాలి’’ అని సూచించారు. 

ద్రౌపదికి జరిగిన అవమానం  
నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం ఎన్నో విపరిణామాలకు దారితీసిందని అమిత్‌ షా గుర్తుచేశారు. ‘‘సభా గౌరవం దిగజారితే దేశంలో కూడా అలాంటి దుష్పరిణామాలు తప్పవు. స్పీకర్‌ సారథ్యంలో జరిగే చర్చలతో దేశానికి ఎనలేని మేలు జరుగుతుంది. చట్టసభల భవనాలు జీవం పోసుకుంటాయి. స్పీకర్‌ అంటే సంరక్షకుడు, సేవకుడు. 

సమస్యల పరిష్కారానికి మేధోమథనమే ఉత్తమ మార్గం. ‘‘ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయి సోదరుడు, స్వాతంత్య్ర యోధుడు విఠల్‌భాయి పటేల్‌ వందేళ్ల క్రితం సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మన దేశంలో శాసనసభ చరిత్ర అప్పుడే మొదలైంది. అలాంటి విఠల్‌భాయి చరిత్ర ఇన్నాళ్లూ మరుగున పడింది’’ అని ఆవేదన వెలిబు చ్చారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ తదితరులు సదస్సులో మాట్లాడారు.  
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)