Breaking News

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతాం

Published on Sun, 11/30/2025 - 03:27

సాక్షి, బెంగళూరు: ‘‘అధి కార మార్పిడి అంశంపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. గతంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు, ఇకముందు కూడా కలిసి పనిచేస్తాం’’అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తేల్చిచెప్పారు. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. బెంగళూరులోని సీఎం అధికారిక నివాసం కావేరిలో అల్పాహార భేటీ అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. 

నెల రోజుల నుంచి ఉన్న సందిగ్ధతకు తెరదించేందుకే ఈ భేటీ జరిగిందని, రేపటి నుంచి ఎలాంటి గందరగోళాలు ఉండవని సీఎం సిద్ధు పేర్కొన్నారు. హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలనే అంగీకారానికి వచ్చామని తెలిపారు. ‘‘కేసీ వేణుగోపాల్‌ నాకు ఫోన్‌ చేసి డీకేను అల్పాహార భేటీకి పిలవమని చెప్పారు. డీకేకు కూడా ఆయన ఫోన్‌ చేశారు. మీరే మా ఇంటికి భోజనానికి రావాలని డీకే నన్ను ఆహ్వానించారు. 

తొలుత మీరే అల్పాహార భేటీకి రావాలని అడిగాను. మాకు 2028 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఎంతో ముఖ్యం. వాటిపై చర్చించాం. డిసెంబర్‌ 8న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతాయి. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై మాట్లాడుకున్నాం. అవాస్తవాలు, అబద్ధాలు, ఆరోపణలు బీజేపీ, జేడీఎస్‌కు అలవాటే. వాటిని సమర్థంగా ఎదుర్కొంటాం. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని పత్రికల్లో చూస్తున్నా. అసెంబ్లీలో మా బలం 140, ప్రతిపక్షాలు రెండూ కలిసినా వారి బలం 82 దాటదు. అవిశ్వాసానికి అవకాశమే లేదు’’అని సీఎం సిద్ధు వివరించారు. 

సీఎం ప్రతి మాటకు నా మద్దతు.. 
సీఎం చెప్పిన ప్రతి మాటకు మద్దతు పలుకుతున్నానని, నాయకత్వం విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అని, పార్టీ పెద్దలు తమను పిలిస్తే ఢిల్లీకి వెళ్తా మని డీకే అన్నారు. ప్రజలకు ఇచి్చన వాగ్దానం ప్రకారం సిద్ధుతో కలిసి పనిచేస్తా నని తెలిపారు. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించారని, ఇంకొంతకాలం వేచి ఉండడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఒకట్రెండు రోజు ల్లో సీఎం తమ ఇంటికి భోజనానికి వస్తారని పేర్కొన్నారు. 

‘‘రాజకీయంగా మా ఇద్దరిదీ ఒకే తీర్మానం. గతంలో అధిష్ఠానం ఏ నిర్ణయించిందో దాని ప్రకారం మేమంతా వెళ్తున్నాం. భవిష్యత్తులోనూ వెళ్తాం. మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మాకు వర్గాలు లేవు. మాది కాంగ్రెస్‌ పార్టీ వర్గం. సిద్ధరామయ్య 2013లో సీఎం అయినప్పుడు నాకు ఆర్నెల్లు మంత్రి పదవి దక్కలేదు. అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. మేమంతా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం. అందరిని కలుపుకొని వెళ్లే బాధ్యత మాపై ఉంది’’అని చెప్పారు. 

కాగా, అధిష్ఠానం సూచనలతో శనివారం ఉదయం 9.30కు డీకే శివకుమార్‌ సీఎం సిద్ధు అధికారిక నివాసం కావేరికి అల్పాహార భేటీకి వెళ్లారు. డీకేను సీఎం సాదరంగా స్వాగతించి లోపలకు తీసుకెళ్లారు. ఇద్దరు ప్రత్యేక గదిలో చర్చించుకున్నారు. అరగంట పాటు జరిగిన సమావేశంలో ఢిల్లీలో 2023లో జరిగిన ఒప్పందం, నాయకత్వ మార్పు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలు చర్చించినట్లు తెలిసింది.  

నేడు సోనియా సమక్షంలో తుది నిర్ణయం 
రాహుల్‌గాంధీ శనివారం ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు సమావేశమయ్యారు. సిద్ధు–డీకే భేటీ, తదుపరి పరిణామాల గురించి ఖర్గే–రాహుల్‌ చర్చించారు. ఆదివారం ఖర్గే, రాహుల్‌ మరోసారి సమావేశమై అగ్రనేత సోనియాగాం«దీతో చర్చించి, తుది నిర్ణయానికి వస్తారని తెలిసింది.   

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)