amp pages | Sakshi

‘‘ఆమె డీఎన్‌ఏ తేడా.. భారత్‌ ఓడిపోతే.. టపాసులు కాల్చింది’’

Published on Tue, 10/26/2021 - 16:22

చండీగఢ్‌: టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ ఓటమి తర్వాత దేశంలో రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి. టీమిండియా ఓటమితో బాధలో ఉన్న క్రీడాభిమానులు మన రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు చూసి.. తలలు పట్టుకుంటున్నారు.

టీమిండియా ఓటమి అనంతరం పలువురు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా వారి జాబితాలోకి హరియాణా హెల్త్‌ మినిస్టర్‌ అనిల్‌ వీజ్‌ చేరారు. పాకిస్తాన్‌ విజయంపై స్పందించిన అనిల్‌ విజ్‌.. జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డీఎన్‌ఏలోనే ఏదో లోపం ఉందన్నారు. ముఫ్తీలో భారతీయత ఏ మేరకు ఉందో నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు. సోమవారం మెహబూబా ముఫ్తీ చేసిన ట్వీట్‌ని ఉద్దేశించి అనిల్‌ విజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
(చదవండి: టీమిండియాతో మ్యాచ్‌: పాక్‌ మినిస్టర్‌ సంచలన వ్యాఖ్యలు)

‘‘టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ సాధించిన గెలుపును కొందరు కశ్మీరీలు సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పుడు మిఠాయిలు పంచుకున్నారు కొందరు. వారు గుర్తులేరా’’ అంటూ ముఫ్తీ ట్వీట్‌ చేశారు. దీనిపై అనిల్‌ విజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
(చదవండి: Ind Vs Pak: భారత్‌ ఓటమి... గుండెపోటుతో అభిమాని మృతి )

‘‘మెహబూబా ముఫ్తీ డీఎన్‌ఏలోనే ఏదో తేడా ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆమె మాత్రమే కాదు పాకిస్తాన్‌ విజయం సాధించిన సందర్భంగా కొందరు టపాసులు కాల్చారు. వారి డీఎన్‌ఏ కూడా తేడానే. మన చుట్టూ దాక్కున్న దేశ ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ అనిల్‌ విజ్‌ ట్వీట్‌ చేశారు. 

చదవండి: Mohammad Shami: పాక్‌ అభిమానికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌