Breaking News

డిజిటల్‌ అరెస్ట్‌లపై సీబీఐ విచారణ 

Published on Tue, 10/28/2025 - 06:34

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నేరాలపై ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని తమకు తెలపాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 3వ తేదీకల్లా పూర్తి వివరాలు పంపాలని, సీబీఐ దర్యాప్తును సమీక్షిస్తామని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగీ్చల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. గత విచారణ సందర్భంగా తమకు పూర్తి వివరాలు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులిచి్చంది. ఈ కేసును సోమవారం జస్టిస్‌ జస్టిస్‌ సూర్యకాంత్, జాయ్‌మాల్య బాగీ్చల ధర్మాసనం విచారించింది.  

ఎఫ్‌ఐఆర్‌ వివరాలను అందించండి 
దేశంలో జరుగుతున్న సైబర్‌ మోసాలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను నవంబర్‌ 3వ తేదీన చేపట్టే తదుపరి విచారణ నాటికి అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా జరిగిన విచారణ, దర్యాప్తు పురోగతి వంటి అంశాలను వివరించాలని కోరింది. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మోసాలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తమను డిజిటల్‌ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను చూపి, భయపెట్టి రూ.1.05 కోట్లు కాజేశారంటూ హరియాణాకు చెందిన వృద్ద దంపతులు 
సెపె్టంబర్‌ 21న సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌కి లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం తెల్సిందే. 

సమన్వయం అవసరం 
సైబర్‌ నేరాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టాలంటే కేంద్ర, రాష్ట్రాల దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం అవసరముందని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. ‘హోం శాఖ, సైబర్‌ క్రైం విభాగం సహకారంతో సీబీఐ ఇప్పటికే పలు కేసులను విచారిస్తోంది’అని సొలిసిటర్‌ జనరల్‌ తుషా ర్‌ మెహతా ధర్మాసనానికి తెలిపారు.

 ‘ఈ కుంభకోణం ప్రత్యేక విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సీబీఐ సిద్ధంగా ఉందా? అందుకు అవసరమైన అదనపు వ్యయం ఏమిటి?‘అని జస్టిస్‌ బాగ్చీ తుషార్‌ మెహతాను అడిగారు. ‘సైబర్‌ నేరాలలో నిపుణులు అవసరమైతే, వారు మాకు చెప్పవచ్చు’అంటూ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నా రు. దేశంతోపాటు మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి కూడా ఇవి జరుగుతున్నందున వీటిపైనా విచార ణ చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికతో తదుపరి విచారణ సమయానికి సీబీఐ ముందుకు రావాలని కోరారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)