Breaking News

మళ్లీ దగ్గరైన సోనియా, జయా?.. ఇండియా బ్లాక్ మీట్‌లో స్పష్టం!

Published on Tue, 08/12/2025 - 12:26

న్యూఢిల్లీ: ఎట్టకేలకు గాంధీలు- బచ్చన్ల మధ్య వైరం ముగిసినట్లుంది. 2024 ఆగస్టులో కాంగ్రెస్ దిగ్గజ నేత సోనియా గాంధీ.. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌కు మద్దతుగా పార్లమెంటులో ఏదో అంశంపై వాకౌట్ చేయడంతో వారిద్దిరి మధ్య స్నేహం తిరిగి చిగురిస్తున్నదనే మాటలు వినిపించాయి. అయితే తాజాగా సోనియా గాంధీ, జయా బచ్చన్‌లు పక్కపక్కనే కూర్చుని కనిపించడంతో, వీరి మధ్య స్నేహం తిరిగి ఖాయమయ్యిదని స్పష్టమవుతోంది.  

పక్కపక్కనే కూర్చుని..
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీలో ఇండియా అలయన్స్ నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందు  ఇండియా కూటమి నేతల ఐక్యతను చాటిందనిపించేలా పలు దృశ్యాలు కనిపించాయి. ఈ విందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో పంచుకుంది. రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ సందర్భంగా పార్టీ షేర్‌ చేసిన ఫొటోలలో సోనియా గాంధీ, జయా బచ్చన్ సంభాషించుకుంటూ కనిపించారు. దీనిని చూసినవారంతా గాంధీ, బచ్చన్‌ కుటుంబాల మధ్య వివాదాలు సమసిపోయాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
 

సరోజినీ నాయుడు కలిపిన బంధం
గాంధీ-బచ్చన్ కుటుంబాల మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉంది. రాహుల్, ప్రియాంక గాంధీలు అమితాబ్ బచ్చన్‌ను మామ అని పిలుస్తుంటారట. అలహాబాద్‌లో ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడిందని చెబుతుంటారు.  ఆ నాడు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సరోజినీ నాయుడు ఆనంద్ భవన్‌లో కవి హరివంశ్ రాయ్ బచ్చన్‌, తేజీ బచ్చన్‌లను జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలకు పరిచయం చేశారు. దీంతో ఇరు కుటుంబాల స్నేహం మూడు తరాలుగా కొనసాగుతోంది. సోనియా గాంధీ పలు సందర్భాలలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేందుకు తనను బచ్చన్ల ఇంటిలో ఉండమని అత్త ఇందిరాగాంధీ చెప్పేవారిని తెలిపారు.

 

రాజీవ్‌ హత్యా సమయంలో..
రాజీవ్ గాంధీని వివాహం చేసుకునే ముందు సోనియా బచ్చన్ల ఇంట్లోనే ఉన్నారు. రాజకీయ,వ్యక్తిగత సంక్షోభ సమయాల్లో ఇరు కుటుంబాలు పరస్పరం అండగా నిలిచాయి. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత అమితాబ్ కాంగ్రెస్ అభ్యర్థిగా అలహాబాద్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు.  1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు.. లండన్‌లో ఉన్న అమితాబ్, బోస్టన్‌లోని రాహుల్ గాంధీతో పాటు ఇండియాకు వచ్చి  అంత్యక్రియల ఏర్పాట్లలో పాల్గొన్నారని చెబుతారు. కాగా  బోఫోర్స్ కుంభకోణం సమయంలో గాంధీ, బచ్చన్‌ కుటుంబాల్లో విబేధాలు వచ్చాయనే వాదనలు వినిపిస్తుంటాయి.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)