Breaking News

ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా సంజయ్‌ మిశ్రా

Published on Wed, 03/26/2025 - 11:26

న్యూఢిల్లీ: మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM)లో కార్యదర్శి హోదాలో పూర్తి సమయం సభ్యునిగా  ప్రభుత్వం నియమించింది. ఈమేరకు మంగళవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(Economic Advisory Council to the Prime Minister)(EAC-PM) అనేది అనేది ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆర్థిక, సంబంధిత అంశాలపై సలహా ఇచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర సంస్థ.

EAC-PM ప్రస్తుత సభ్యులు
సుమన్ బెర్రీ (ఛైర్మన్)
సంజీవ్ సన్యాల్ (సభ్యులు)
డాక్టర్ షమికా రవి (సభ్యులు)
రాకేశ్ మోహన్ (పార్ట్ టైమ్ సభ్యులు)
డాక్టర్ సజ్జిద్ చినోయ్ (పార్ట్ టైమ్ సభ్యులు)
డాక్టర్ నీలేశ్ షా (పార్ట్ టైమ్ సభ్యులు)
ప్రొఫెసర్ టీటీ రామ్మెహన్ (పార్ట్ టైమ్ సభ్యులు)
డాక్టర్ పూనమ్ గుప్తా (పార్ట్ టైమ్ సభ్యులు)

సంజయ్ కుమార్ మిశ్రా(Sanjay Kumar Mishra) 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్‌ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణునిగా ఆయన పలు ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ కుమార్ మిశ్రా 2018, నవంబర్‌ 19న న రెండు సంవత్సరాల పదవీకాలానికి ఈడీ చీఫ్‌గా నియమితులయ్యారు. దీనికిముందు ఆయన ఢిల్లీలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు. 2020లో మిశ్రా పదవీకాలాన్ని మూడు సంవత్సరాలకు పొడిగించారు.

సీఎన్‌బీసీ టీవీ 18 పేర్కొన్న వివరాల ప్రకారం మిశ్రా హయాంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాపై మిశ్రా నేతృత్వంలో ఈడీ చర్యలు చేపట్టింది. 

ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)