Breaking News

రైల్వే స్టేషన్లలో ఏదైనా కొనుక్కుంటున్నారా? ఇలా కాలర్‌ పట్టుకుంటారు జాగ్రత్త!

Published on Sun, 10/19/2025 - 20:29

భోపాల్‌: అది ఓ ప్రాంత రైల్వేస్టేషన్‌. ఓ పక్క ట్రైన్‌ కదులుతుంటే.. పక్కనే ఓ యువకుడి కాలర్‌ పట్టుకుని సమోసా వ్యాపారి బెదిరిస్తున్నాడు. ‘నా ట్రైన్‌ కదులుతోంది..నన్ను వదిలి పెట్టండి నమహాప్రభో అని బ్రతిమాలడుతున్న పట్టించుకోలేదు. పైగా ట్రైన్‌ పోతే పోనీ.. నన్నేం చేయమంటావు. నా డబ్బులు ఇస్తావా.. చస్తావా.. నా టైం వేస్టు చేశావు అంటూ సదరు సమోసా వ్యాపారి ప్రయాణికుడిని బెదిరించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో సమోసా వ్యాపారికి, రైల్వే ప్రయాణికుడికి మధ్య జరిగిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న ఓ ట్రైన్‌ జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఏదైనా దొరుకుతుందేమోనని పరిసరాల్ని నిశితంగా గమనించాడు. అటు పక్కనే సమోసాలు అమ్మే స్టాల్‌ అతని కంట్లో పడింది. వెంటనే ట్రైన్‌ దిగి సమోసాలు తీసుకుని.. ఓ సంస్థ యూపీఐ యాప్‌ నుంచి పేమెంట్‌ చేసే ప్రయత్నం చేశాడు. నెట్‌వర్క్‌ సమస్య వల్ల చెల్లింపులు జరగలేదు. వెంటనే తీసుకున్న సమోసాలు తిరిగి వ్యాపారికి ఇచ్చి బయల్దేరాడు ఆ యువకుడు. 

అంతే ఠాట్‌.. నా టైం వేస్ట్‌ చేశావు. సమోసాలు తీసుకుని డబ్బులు ఇచ్చి ముందుకు కదులు అంటూ ప్రయాణికుడికి సమోసా వ్యాపారి హుకుం జారీ చేశాడు. అంతలోనే ట్రైన్‌ మెల్లగా కదలడం మొదలైంది. క్షమించండి. సమోసాలు వద్దు. నా దగ్గర ‍లిక్విడ్‌ క్యాష్‌ లేవుంటూ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతే ఒక్క ఉదుటున.. అవన్నీ చెప్పకు.. డబ్బులు ఇచ్చి సమోసాలు తీసుకో అంటూ ప్రయాణికుడిని కాలర్‌ పట్టుకున్నాడు. కాలర్‌ విడిపించుకుని ముందుకు వెళుతుంటే అడ్డు తగిలాడు. 

అతని చేతికి ఉన్న చేతిగడియారం (wristwatch) బలవంతంగా తీసుకున్నాడు. నాలుగైదు సమోసాలు ప్రయాణికుడు చేతిలో పెట్టాడు. ట్రైన్‌ మరింత వేగంతో ముందుకు కదులుతుంటే పాపం ఏం చేయాలో పాలపోని యువ ప్రయాణికుడు సమోసాలు తీసుకుని ట్రైన్‌ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.    

ఈ వీడియో వైరల్‌ కావడంతో జబల్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) స్పందించారు. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సమోసా వ్యాపారిపై చర్యలకు ఉపక్రమించాం. రైల్వే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు’అని పేర్కొన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా  కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. 

మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమోసా వ్యాపారి ప్రవర్తనను తప్పుపడుతుండగా, మరికొందరు యూపీఐ చెల్లింపులపై ఆధారపడటం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.  యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలు,నెట్‌వర్క్ సమస్యలు వల్ల చెల్లింపులు నిలిచిపోవడం సాధారణమే అయినా, విక్రేతలు దీనిపై ఎలా స్పందించాలి అనే అంశంపై స్పష్టత అవసరం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)