Breaking News

అర్థాంతరంగా నిలిచిపోయిన క్లీన్‌ కేరళ కార్యకలాపాలు

Published on Wed, 09/09/2026 - 15:54

పంబ , సన్నిధానంలో పనులు ప్రారంభించిన ఒక్క రోజే క్లీన్ కేరళ కంపెనీ తన వ్యర్థాల తొలగింపు కార్యకలాపాలను అర్థాంతరంగా నిలిపేసింది. దాంతో  శబరిమల వ్యర్థాల నిర్వహణ కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదం ఎదురైంది. దాదాపు ఒక ఏడాది పాటు జరిగిన చర్చల అనంతరం, శబరిమల నుంచి వెలువడే వ్యర్థాలన్నింటినీ వేరు చేసి తొలగించాలని ఒక అవగాహనకు వచ్చారు. 

ఈ ప్రణాళికలో భాగంగా, వేరు చేసిన వ్యర్థాల మొదటి విడతను సిద్ధం చేశారు. జీవవిచ్ఛిన్నం కానీ వ్యర్థాల సేకరణ అధికారిక ప్రారంభోత్సవాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే , ఆ కార్యక్రమం సజావుగా జరగలేదు. కొంతమంది అధికారులు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాల సేకరణ మరియు విభజన నుండి క్లీన్ కేరళ కంపెనీని మినహాయించారు.

టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో , ప్రస్తుతానికి సన్నిధానం నుండి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే సంచులలో ప్యాక్ చేసి పంబకు తరలించాలని నిర్ణయించారు. సన్నిధానం, పంబలోని వివిధ ప్రాంతాల నుండి చెత్త , ప్లాస్టిక్ బాటిల్స్ , గాజు సీసాలు , స్క్రాప్ సామాగ్రి మరియు నిర్మాణ శిధిలాలతో సహా పేరుకుపోయిన వ్యర్థాలను వేరు చేసి తొలగించాలన్నది అసలు ప్రణాళిక. ప్రతిపాదిత ఏర్పాటు ప్రకారం , పునర్వినియోగించదగిన పదార్థాల కోసం దేవస్థానం బోర్డు ఒక స్థిరమైన మొత్తాన్ని అందుకుంటుంది, అయితే మిగిలిన వ్యర్థాలను శుద్ధి చేసి, పారవేసినందుకు రుసుములు వసూలు చేస్తారు కూడా. 

ఈ విషయమై ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదరలేదు. అయితే శబరిమల యాత్రా కాలం సమీపిస్తుండటంతో , ఒప్పందం ఇంకా కుదరకపోయినప్పటికీ పనులు ప్రారంభించాలని క్లీన్ కేరళ కంపెనీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నేపథ్యంలోనే కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు ఒక వాహనంతో శబరిమలకు చేరుకుని వ్యర్థాల తొలగింపు పనులను ప్రారంభించారు. తీరా ప్రారంభించాక ప్రతిపాదిత వ్యర్థాల నిర్వహణ ఏర్పాటుపై అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ పనులను తక్షణమే నిలిపివేశారు. 

కాగా, క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్ (CKCL) కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోలేదని చెబుతున్నారు అధికారులు.  కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో కార్మిక వివాదాలు, అలాగే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లతో ఏర్పడిన సమన్వయ లోపాల వల్ల తాత్కాలికంగా కొన్ని చోట్ల పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అలాగే కొన్ని కార్మిక సంఘాలు నోక్కుకూలి' (పని చేయకుండానే డిమాండ్ చేసే అక్రమ కూలి) కోసం పట్టుబట్టడం కూడా ఒక కారణమనేది అధికారిక వర్గాల సమాచారం. 

(చదవండి: 

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)