Breaking News

మా పనిని అడ్డుకుని.. కీలక ఆధారాల్ని లాక్కెళ్లారు

Published on Thu, 01/08/2026 - 16:27

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తీవ్ర ఆరోపణలకు దిగింది. ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో గురువారం జరిపిన తనిఖీల సందర్భంగా తమతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెబుతోంది. అంతేకాదు.. తాము రికవరీ చేసిన ఆధారాలను పట్టుకుపోయారని ఆరోపిస్తోంది. 

ప్రముఖ పొలిటికల్‌ కన్సల్టెన్సీ ఐప్యాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోల్‌కతా సహా దేశంలోని ఐప్యాక్‌కు చెందిన పలు చోట్ల ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసం వద్ద సోదాలు జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కడికి సీఎం మమతా బెనర్జీ సీపీ మనోజ్‌ బెనర్జీతో కలిసి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

అయితే కాసేపటి తర్వాత జైన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె చేతిలో.. ఓ ల్యాప్‌ట్యాప్‌, మొబైల్‌ ఫోన్‌, పలు డాక్యుమెంట్లతో కూడిన గ్రీన్‌ ఫైల్‌ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  ఆమె మీడియాతో.. బెంగాల్‌ ఎలక్షన్స్‌ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ తమను లక్ష్యంగా చేసుకుందని.. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని ఆమె మండిపడ్డారు కూడా. అయితే ఆమె ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. 

ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. పక్కా ఆధారాలతోనే ఈ తనిఖీలు నిర్వహించాం. ఎక్కడా కూడా ఏ పార్టీ కార్యాలయాన్ని టచ్‌ చేయలేదు. ఏ ఎన్నికలతోనూ మాకు సంబంధం లేదు. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు. అంతా చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాం అని ఈడీ ప్రకటించింది. అలాగే.. ఆ సమయంలో ఆమె తమ నుంచి బలవంతంగా పత్రాలను, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ను లాక్కున్నారని ఆరోపించింది. అంతేకాదు.. ఈ పరిణామంపై ఈడీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. తమ విధులకు ఆటంకం కలిగించారని, ఆధారాలను తీసుకెళ్లారని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రేపు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కోల్కతాలో ఈడీ VS సీఎం మమతా బెనర్జీ

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు.. నేటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధం. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారు. మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు అని దీదీ మండిపడ్డారు. 

అయితే మమతా బెనర్జీ చేసింది ఈడీ దాడుల్లో జోక్యం చేసుకోవడమేనని ప్రతిపక్ష బీజేపీ మండిపడుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఆమె ప్రవర్తన అనైతికం అన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)