Breaking News

ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చించాలి

Published on Sat, 11/29/2025 - 06:42

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చిన వాయు కాలుష్యంపై పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో చర్చకు పెట్టాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించకుండా ప్రధాని మోదీ మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే కఠినమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. 

ఇంత తీవ్రమైన సమస్యపై మోదీ ప్రభుత్వం స్పందించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో తనను కలిసేందుకు వచి్చన మహిళలతో మాట్లాడారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌ విడుదల చేశారు. ‘కాలుష్యం ప్రభావం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. నా వద్దకు వచి్చన ప్రతి మహిళా కాలుష్యం గురించే ఆందోళన వ్యక్తం చేశారు. ఎదిగే చిన్నారులు విష వాయువులను పీల్చుతున్నారంటూ వారు ఆగ్రహం, ఆందోళన చెందుతున్నారు. 

మీరెందుకు ఇది అత్యవసర సమస్య అని భావించడం లేదు? బాధ్యతగా ఎందుకు తీసుకోవడం లేదు?’అంటూ ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘మన చిన్నారులకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి.. సాకులు గానీ, పక్కదారి పట్టించే చర్యలు గానీ కాదు’అని రాహుల్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో జీవించే అత్యంత నిరుపేదల నుంచి అత్యంత ధనికుల వరకు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాలుష్యంతో లాభాలను ఆర్జిస్తున్న వారు బాధితుల కంటే శక్తివంతైన వారు కావడం వల్లే ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తోందంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.

 కలుషిత గాలిని పీల్చుతూ దేశంలో రోజుకు 500 మంది వరకు చిన్నారులు చనిపోతున్నారని రాహుల్‌ చెప్పారు. అయినప్పటికీ దీనినో అత్యవసర అంశంగా ప్రభుత్వం భావించడం లేదని నిప్పులు చెరిగారు. బాధితులుగా ఉన్న సామాన్యులకు సంఘటితమైన రాజకీయ శక్తి లేకపోవడం వల్లే సమస్య తీవ్ర రూపం దాలుస్తోందని ఆయన తెలిపారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై చర్చ జరపాల్సిందేనన్నారు. ‘గడిచిన 15 ఏళ్లుగా ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత తీవ్ర స్థాయికి పడిపోయింది. వచ్చే పదేళ్లలో మరింత అధ్వానంగా మారనుంది. ఇప్పటికీ స్పందించకుంటే ఇదో విస్ఫోటంలా మారుతుంది’అని ఈ సందర్భంగా ఓ మహిళ రాహుల్‌తో అన్నారు.   

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు