లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
మంత్రి అతిషి జెండా ఎగురవేస్తారు: ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ!
Published on Wed, 08/07/2024 - 10:28
న్యూఢిల్లీ: ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15నాడు తనకు బదులు సీనియర్ మంత్రి అతిషి జాతీయ జెండా ఎగురవేస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతి ఏటా ఆగస్టు 15నాడు ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో సీఎం జాతీయ జెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్జైలులో ఉన్నందున జెండా ఎగురవేయలేని పరిస్థితి ఏర్పడింది.
#
Tags : 1