amp pages | Sakshi

భారత్‌లో కరోనా టెన్షన్‌.. ఒక్కరోజులో 40శాతం కేసులు జంప్‌!

Published on Thu, 03/30/2023 - 12:03

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ టెన్షన్‌కు గురిచేస్తోంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే 40 శాతం పాజిటివ్‌ కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3వేలు దాటింది. 

వివరాల ప్రకారం.. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3016 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైదారోగ్య శాఖ తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ అని స్పష్టం చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 1,10,522 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రోజువారీ కేసుల సంఖ్య 2,151గా ఉండగా.. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు పెరిగాయి. మరోవైపు, దేశంలో వైరస్‌ కారణంగా నిన్న ఒక్కరోజు 14 మరణాలు చోటుచేసుకున్నాయి. కేరళలో 8, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకరు మృతిచెందారు. తాజా మరణాలలో దేశంలో ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862కి చేరింది. 

ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,509గా ఉంది. ఇక రకవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 3వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్‌ 2వ తేదీన 3375 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆరు నెలల తర్వాత నేడు.. కేసుల సంఖ్య 3వేల మార్క్‌ దాటింది. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)