Breaking News

ఏడో రోజూ రికవరీలే అధికం

Published on Fri, 05/21/2021 - 06:04

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజూ కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 2,76,110 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,57,72,400కు పెరిగింది. తమిళనాడులో అత్యధికంగా ఒక్క రోజులో 34,875 కేసులు రాగా, కర్ణాటకలో 34,281 నమోదయ్యాయి. మరో సానుకూల పరిణామంగా వరుసగా నాలుగు రోజులుగా కొత్త కేసులు రోజుకు 3 లక్షలలోపే నమోదవుతున్నాయి. దేశంలో మరో 3,69,077 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,23,55,440కి పెరిగింది. అయితే గత 24 గంటల్లో దేశంలో కోవిడ్‌ కారణంగా 3,874 మంది మృత్యువాతపడ్డారు. నాలుగు రోజుల తర్వాత తొలిసారిగా దేశంలో కోవిడ్‌తో మరణించి వారి సంఖ్య 4వేల కన్నా తక్కువగా నమోదైంది.

కొత్తగా నమోదైన మరణాల్లో 72.25 శాతం మరణాలు 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 2,87,122కు చేరింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,29,878కు తగ్గింది. రోగుల రికవరీ రేటు 86.74 శాతం ఉండగా, దేశంలో మరణాల రేటు 1.11 శాతంగా నమోదైంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకారం గడిచిన 24 గంటల్లో 20,55,010 కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో పరీక్షలు జరగటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 13.44 శాతంగా నమోదైంది. మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు 18,70,09,792కు చేరాయి.   


ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద దాదాపు రెండు కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు ఉన్నాయని, మరో మూడ్రోజుల్లో మరో 26 లక్షల డోసులను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)