రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
Breaking News
సంధ్య థియేటర్ ఘటన: విచారణకు వర్చువల్గా హాజరైన బన్నీ
Published on Mon, 07/06/2026 - 14:04
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 రిలీజ్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్గా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబైలో షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల కోర్టు ఆయనకు వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతి నిచ్చింది. గత విచారణకు కూడా బన్నీ వర్చువల్గానే హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. నిందితులందరూ కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ కొనసాగుతుందని గతంలో న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేటి విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కేసులోని 23 మంది నిందితులకు సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను అందజేశారు.
అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. నిందితులకు ఛార్జ్ షీట్ కాపీలు అందడంతో, వచ్చే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags : 1