Breaking News

అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది

Published on Sun, 07/10/2022 - 09:35

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసులు వర్షం కురిపించింది. తెరపై మహేశ్‌ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో  సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్‌ హిట్‌గా నిలిచింది.

అయితే ఈ చిత్రంలో చిన్న చిన్న మార్పులు చేసుంటే మరింత పెద్ద విజయం సాధించేదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.  ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాలపై రివ్యూ ఇస్తున్న అయన.. తాజాగా ‘సర్కారు వారి పాట’పై తన అభిప్రాయన్ని వెల్లడించారు. 

(చదవండి: జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను..అదే నా భయం : తమన్నా)

ఈ సినిమా ఫస్టాఫ్‌లో మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ప్రేక్షకులను బాగా అలరించాయని ఆయన అన్నారు. సరదాగా సాగిపోతున్న సమయంలో మహేశ్‌ ఇండియాకి తిరిగి రావడం అనేది ప్రమాదకరమైన మలుపు అని ఆయన అభిప్రాయపడ్డాడు.

అలా కాకుండా కీర్తి సురేశ్‌, మహేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ నిడివి పెంచి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్‌ అయ్యేదన్నారు. హీరోతో పాటు హీరోయిన్‌ని కూడా ఒకే విమానంలో తిరిగి ఇండియాకు తీసుకువచ్చేలా కథ రాసుకొని ఉంటే..తెలియకుండానే కొన్ని కామెడీ సన్నివేశాలు, రొమాన్స్‌ సీన్స్‌ యాడ్‌ అయ్యేవని..అలా అయితే ఈ సినిమా మరో వంద కోట్లు ఎక్కువ కలెక్ట్‌ చేసేదని పరుచూరి చెప్పుకొచ్చారు. 

Videos

మస్క్ స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్

సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం

నా దారి దొంగదారి !

లోకేష్ పై పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు

మహానాడు పరిస్థితి చూశారా? తమ్ముళ్లా మజాకా!

బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

Photos

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)