వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!
Breaking News
ఆ ఊర్లోని చావులకు కారణం ఎవరు?.. ఆసక్తికరంగా ‘మంగళవారం’ ట్రైలర్
Published on Sat, 10/21/2023 - 13:13
‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మంగళవారం’. . పాయల్ రాజ్పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఒక ఊర్లో జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఊర్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లను ఓ అజ్ఞాతవాసి గోడపై రాస్తుంటాడు. ఆ గోడమీద రాస్తున్నదెవరు? ఎందుకు అలా చేస్తున్నారు? ప్రతి మంగళవారం ఊర్లో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ ‘ట్రైలర్’ సాగుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Tags : 1