కస్టమర్లకు SBI బిగ్ షాక్..! ఫ్రీ ఇక లేదు!
Breaking News
నేను ఊరుకోను.. మెగా కోడలు స్ట్రాంగ్ వార్నింగ్
Published on Thu, 02/12/2026 - 00:34
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. తమ కుటుంబంపై వచ్చిన ట్రోల్స్పై మరోసారి స్పందించింది. కొన్నిరోజుల క్రితం రామ్ చరణ్-ఉపాసన దంపతులతు కవలలు పుట్టిన సందర్భంగా కొందరు.. మెగాస్టార్ చిరంజీవిపై దారుణమైన విమర్శలు చేశారు. అప్పుడే సదరు నెటిజన్కి ఇచ్చిపడేసిన లావణ్య.. ఇప్పుడు ఆ సందర్భం గురించి మరోసారి మాట్లాడింది.
'రామ్ చరణ్కి ట్విన్స్ పుట్టిన ఆనందంలో మేం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో అలాంటి ట్వీట్ వేయడం పూర్తిగా తప్పు. మా కుటుంబానికి ఏమైనా అంటే నేను ఊరుకోను' అని లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈమె ప్రధాన పాత్ర చేసిన 'సతీ లీలావతి' వచ్చే నెల 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ఈవెంట్ సందర్భంగానే మెగా ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించింది.
గతంలో చిరంజీవి, ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ కుటుంబంలో అందరూ ఆడపిల్లలే ఉన్నారని, మెగా లెగసీని కొనసాగించే మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అయితే చిరు.. ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్పి.. చరణ్కి కవలలు పుట్టిన సందర్భంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై ఆ రోజు స్పందించిన లావణ్య.. చిరంజీవి తన కుటుంబంలోని మహిళల్ని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో ఈ విమర్శలు చేసేవారికి అస్సలు అవగాహన లేదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదు అని అప్పుడు కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మాట్లాడుతూ.. ఫ్యామీలీ జోలికొస్తే ఊరుకోనని చెప్పుకొచ్చింది.
If anyone says anything about my family, I won’t tolerate it. That’s why I reacted.
- #LavanyaTripathi | #Megafamily
pic.twitter.com/Rupc5BxdVD— Filmyscoops (@Filmyscoopss) February 11, 2026
Tags : 1