Breaking News

పేషెంట్లపై కాల్పులు.. వందలమంది ఉరి?

Published on Wed, 02/11/2026 - 15:42

ఇటీవల ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆదేశంలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో ఖమేనీ సర్కార్ వారి నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేసింది. పెద్ద సంఖ్యలో అక్కడి పౌరులపై కాల్పులు జరిపింది. మిగతా వారిని జైళ్లలో బంధించింది. ఇదంతా తెలిసిన విషయమే.. అయితే జైళ్లలో బంధించిన నిరసనకారులను ఇరాన్ చిత్రవధకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని అక్కడి సైనికులు కాల్చివేస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు అణు ఒప్పందంపై చర్చలకోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే గనుక తీవ్ర యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు ప్రపంచాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.  ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపిన వారిని అక్కడి ప్రభుత్వం ఊచకోత కోస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. "ఇరాన్‌ నిరసనల్లో గాయపడిన వారిని అక్కడి భద్రతా బలగాలు ఆసుపత్రుల్లోనే  కాల్చి చంపుతున్నాయి. అందుకోసం ఆసుపత్రుల్లో ఇటీవల చేరిన వివరాలను ఇరాన్ భద్రతా బలగాలు సేకరిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు సాధారణంగా మారిపోయాయి. భద్రతా బలగాల భయానికి నిరసనల్లో గాయపడిన వారు ఆసుపత్రులకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాకుండా అక్కడ జైళ్లలో మగ్గుతున్న మహిళలపై తీవ్రమైన లైంగిక దాడులు జరుగతున్నాయి. అక్కడ నిరసనలల్లో అరెస్టై జైళ్లలో ఉన్న మహిళలు తమ కుటుంబసభ్యులను గర్భనిరోధక మాత్రలు పంపించాల్సిందిగా కోరుతున్నారు" అని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

వీటితో  పాటు గడిచిన మూడు వారాల్లో 207 మంది రాజకీయ ఖైదీలు ఉరితీయబడ్డారని తెలిపింది. వారందరిని దేశవ్యాప్తంగా ఉన్న 57 జైళ్లలో బంధించారు. అయితే అమెరికా కథనాల ప్రకారం ఇరాన్ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 6,221 మంది ఖైదీలు మరణించగా, ఇరాన్ లెక్కల ప్రకారం 3,117 మంది ప్రాణాలు వదిలారు. నిరసనల్లో  ఇప్పటివరకూ 42,000 మందిని అరెస్టు చేశారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)