Breaking News

తరువాయి.. త్రైపాక్షిక చర్చలు

Published on Mon, 08/18/2025 - 23:20

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యురోపియన్‌ యూనియన్‌ కీలక సభ్య దేశాల అగ్రనేతలు యుద్ధ పరిసమాప్తి కృషిపర్వంలో కీలక పురోగతి సాధించారు. ఇందుకు అమెరికా రాజధాని నగరం వేదికైంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో కలిసి తాను త్రైపాక్షిక సమావేశం నిర్వహించబోతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని ఈస్ట్‌రూమ్‌లో ఐరోపా సమాఖ్య కీలక సభ్యదేశాల అగ్రనేతలతో ట్రంప్‌ సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. త్వరలో యుద్ధ విరమణ కోసం పుతిన్, జెలెన్‌స్కీ, ట్రంప్‌ త్రైపాక్షిక సమావేశం జరిపేందుకు ఈయూ నేతలు ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే ఈ త్రైపాక్షిక భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా నిర్ణయించలేదు. సెక్యూరిటీ గ్యారెంటీలో ఉండే ప్రధానాంశాలు సైతం ఇంకా ఖరారుకాలేదు.

 ‘నాటో’ కూటమిలో చేరకపోయినా సరే అదే తరహాలో ‘రక్షణ హామీ’ని ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పుతిన్‌ పేర్కొన్న అంశం ఈ సంయుక్త సమావేశంలో ప్రస్తావనకు వచి్చంది. ఈ సంయుక్త సమావేశంల నాటో కూటమి సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రూటే, యురోపియన్‌ కమిషన్‌ మహిళా అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డీర్‌ లేయిన్, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడ్‌రిక్‌ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్‌  అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశమయ్యారు.

 అయితే ఈ త్రైపాక్షిక సమావేశంలో ఈయూ తరఫున సైతం ఒక ప్రతినిధి పాల్గొంటే మంచిదని  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అభిప్రాయపడ్డారు. నాటోయేతర రక్షణహామీకి ట్రంప్‌ ముందుకు రావడం ఈ మొత్తం ప్రక్రియలో కీలక పరిణామమని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రూటే అన్నారు. తక్షణం కాల్పుల విరమణ ప్రకటిస్తే బాగుంటుందని జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడ్‌రిక్‌ మెర్జ్‌ అభిప్రాయపడ్డారు. యుద్ధకాల్పుల మోత మెల్లగా తగ్గుముఖం పట్టనుందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యానించారు. అంతకుముందు  నేతలంతా ఒక గ్రూప్‌ ఫొటో దిగారు.  

జెలెన్‌స్కీని మెచ్చుకున్న ట్రంప్‌ 
ఈయూ నేతలతో భేటీకి ముందు తొలుత జెలెన్‌స్కీతో ట్రంప్‌ విడిగా సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత భేటీలో టీ–షర్ట్‌ వేసుకొచి్చన జెలెన్‌స్కీని అమెరికా మీడియా తప్పుబట్టిన నేపథ్యంలో ఈసారి నలుపు రంగు సూట్‌ ధరించారు. సూట్‌ డిజైన్‌ను ట్రంప్‌ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఒక లేఖ అందించారు. ‘‘ ఇది మీ భార్య కోసం. అయితే ఇది నేను రాసింది కాదు. నా భార్య రాసింది’’ అనడంతో అందరూ ఫక్కున నవ్వేశారు. తర్వాత ట్రంప్‌ మాట్లాడారు. ‘‘ 

యుద్ధంలో యావత్‌ ప్రపంచమే అలసిపోయింది. మనం దీనిని ఇక ముగింపునకు తీసుకొద్దాం. ఈరోజంతా మంచే జరగబోతోంది. పుతిన్, జలెన్‌స్కీతో కలిసి త్రైపాక్షిక భేటీ ఆమోదయోగ్యమైన రీతిలో జరిగే అవకాశముంది. ఈ యుద్ధం ముగియబోతోంది. ముగింపు అనేది అంతా కాకపోయినా కొంతైనా మిస్టర్‌ జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉంది’’ అని ట్రంప్‌ అన్నారు. సెక్యూరిటీ గ్యారెంటీ హామీలో భాగంగా ఉక్రెయిన్‌కు భవిష్యత్తులో అమెరికా బలగాలు మొహరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్‌ సూటిగా సమాధానం చెప్పలేదు.  

 

Videos

బంగారం కొనుగోలుపై మోదీ కీలక వ్యాఖ్యలు

పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి

నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..

పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

AP: నాగమల్లేశ్వరి అరెస్ట్

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

Photos

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు