Breaking News

వివాహేతర సంబంధం: అద్దెకు ఉంటున్న యువకుడితో...

Published on Mon, 05/02/2022 - 19:58

శంషాబాద్‌ రూరల్‌: ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలియడంతో అతను నేరుగా కోర్టులో లొంగిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆదివారం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సీఐ శ్రీధర్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సాతంరాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లో బీహార్‌కు చెందిన రాహుల్‌ అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు మహిళ ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. ఈ సందర్భంగా ఆమెకు బీహార్‌కు చెందిన రేణు అలియాస్‌ రాను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే సాతంరాయిలో ఉంటున్న రాహుల్‌ తరచూ తొండుపల్లి వచ్చి సదరు మహిళను కలవడంతో పాటు ఫోన్‌లో మాట్లాడేవాడు. దీనిని గమనించిన రేణు తొండుపల్లి వచ్చిన అతడితో గొడవపడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని ఇద్దరిని హెచ్చరించి పంపించారు. గత ఏడాది డిసెంబర్‌ తొండుపల్లికి వచ్చిన రాహుల్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీనిని గుర్తించిన రేణు అతడిని వెంబడించి వెనక నుంచి రాయితో తలపై గట్టిగా కొట్టడంతో ట్రాక్‌ మధ్యలో బోర్ల పడిపోయాడు. రాహుల్‌ చనిపోయినట్లు గుర్తించిన రేణు బీహార్‌కు పారిపోయాడు.  

కేసు మార్పిడితో.. 
అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.గత నెల ఈ కేసును రైల్వే పోలీసులు శంషాబాద్‌ పీఎస్‌కు బదిలీ చేయడంతో  దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రేణు కోసం  బీహార్‌ వెళ్లగా అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన రేణు ఏప్రిల్‌ 25న రాజేంద్రనగర్‌ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో రేణును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఆదివారం సంఘటనా స్థలం వద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)