Breaking News

ఐదు రోజుల పాటు బాత్‌రూమ్‌లోనే..

Published on Sun, 09/11/2022 - 10:30

సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఐదు రోజుల పాటు బాత్‌రూమ్‌లోనే ఆ వ్యక్తి మృతదేహం ఉండిపోయింది. ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడి వరకు వచ్చి పనిచేసుకుంటున్న ఆ మనిషి చనిపోయిన సంగతి ఐదు రోజుల తర్వాత అందరికీ తెలిసింది. టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధి స్థానిక పాతజాతీయ రహదారి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఇంటిలో ఐదు రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతుడు తమిళనాడుకి చెందిన గోవిందన్‌ వేణుగోపాల్‌ (54)గా గుర్తించారు. అతను హడ్డుబంగి గ్రామ సమీపంలో గల మార్గర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ క్వారీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఈ క్వారీ కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి వేణుగోపాల్‌ రూమ్‌లోనే ఉండేవారు. అప్పుడప్పుడు క్వారీకి వెళ్లి వచ్చేవారు. అయితే ఐదు రోజులుగా క్వారీకి రావడం లేదని అక్కడి వాచ్‌మెన్‌ తెలిపారు. వినాయక చవితి రోజున ఆరోగ్యం సరిగా లేదు రానని వాచ్‌మెన్‌కు వేణుగోపాల్‌ చెప్పారు. ఈ నెల 2న ఇంటి అద్దెను కూడా చెల్లించారు. అప్పటి నుంచి ఆయన కనిపించ లేదు. ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని ఇంటి యజమాని అనుకున్నారు. శనివారం వేణుగోపాల్‌ ఉండే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని వెళ్లి చూశారు. బాత్‌రూమ్‌లో వేణుగోపాల్‌ మృతదేహం కనిపించడంతో నిశ్చేష్టుడైపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అతను మరణించి ఐదు రోజులు అయి ఉంటుందని తెలిపారు. క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించారు. మృతుడు ఒక్కడే ఇంటిలో ఉండడంతో అతను చనిపోయిన సంగతి ఎవరికీ తెలియలేదని చెప్పారు. 

చదవండి: మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య 

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)