Breaking News

స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై భర్తతో కలిసి..

Published on Fri, 09/09/2022 - 07:26

సాక్షి, రాయచూరు రూరల్‌: భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి ఘటన యాదగిరి జిల్లాలో ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. గురుమట్కల్‌ తాలూకా కడేచూరు–బాడియాళ పారిశ్రామికవాడలో సిద్దార్థ(30) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఘటన పూర్వాపరాలు...యాదగిరి తాలూకా యలసత్తికి చెందిన సిద్దార్థ బెంగళూరులో సొంతంగా రెండు కార్లను అద్దెకు తిప్పేవాడు. కడేచూరుకు చెందిన శ్రీదేవి(35) అనే మహిళకు శహపుర తాలూకాకు చెందిన బీ.నాగప్పతో పదేళ్ల క్రితం వివాహమైంది. బ్రతుకుదెరువు కోసం బెంగళూరు వెళ్లిన ఈ దంపతులు అక్కడ సిద్దార్థ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే బాడుగకు ఇల్లు తీసుకుని నివాసమున్నారు.  

వివాహేతర సంబంధానికి దారి తీసిన స్నేహం 
ఈక్రమంలో సిద్దార్ధ, శ్రీదేవిల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, చివరకు ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. శ్రీదేవితో కలిసి తమ సొంతూరికి మకాం మార్చిన సిద్దార్థ అనంతరం తన వద్ద ఉన్న కార్లను జల్సాల కోసం అమ్మేశాడు. అతని వద్ద ఉన్న సొమ్మునంతా కాజేసిన శ్రీదేవి తిరిగి భర్తను ఆశ్రయించింది. నాగప్పతో కలిసి ఉండేందుకు మళ్లీ బెంగళూరుకు చేరింది. మళ్లీ జీవనోపాధి కోసం సిద్దార్ధ కూడా బెంగళూరు చేరాడు. అయితే నాలుగేళ్ల క్రితం శ్రీదేవి, నాగప్ప కడేచూరుకు తిరిగొచ్చారు. శ్రీదేవిని చూడాలనుకుంటే సిద్దార్థ నేరుగా బెంగళూరు నుంచి వచ్చి కలిసి మాట్లాడేవాడు. ఓసారి శ్రీదేవి ఇకపై తన వద్దకు రావద్దని సిద్దార్థకు చెప్పడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేశాడు.  

చదవండి: (బడిలోనే బార్‌.. ఆ టీచరమ్మ రూటే వేరు)

వారించినా వస్తున్నాడనే... 
చివరికి సిద్దార్థ తల్లిదండ్రులు జరిగిందేదో జరిగింది, దాన్ని గురించి ఆలోచించకుండా యలసత్తిలో వ్యవసాయం చేసుకొమ్మన్నారు. అయినా ఇటీవల శ్రీదేవిని చూడాలనే ఆశతో యలసత్తి నుంచి సిద్దార్థ కడేచూరుకు వచ్చాడు. ఎంత వారించినా తరచూ వస్తున్నాడని కోపం పెంచుకున్న శ్రీదేవి, ఆమె భర్త నాగప్ప, నాగప్ప తల్లి మహదేవమ్మ, సోదరుడు తిరుపతి కలసి సిద్దార్ధను బాడియాళ పారిశ్రామికవాడలో కొట్టి హత్య చేశారని యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకుని నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సైదాపుర పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కాళప్ప బడిగేర్‌ కేసు నమోదు చేసుకోగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బసవరాజ్‌ తెలిపారు.

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)