Breaking News

డబ్బు కోసమే కిడ్నాప్‌

Published on Sat, 11/30/2024 - 08:38

ఇబ్రహీంపట్నం రూరల్‌: వ్యాపారిని కిడ్నాప్‌ చేసి..కణతకు గన్‌ గురిపెట్టి బెదిరించిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం జోన్‌ డీసీపీ సునీతారెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం చెందిన రచ్చ నారాయణ (71) వివిధ వ్యాపారాలు చేస్తుంటాడు. ఇతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని గుర్తించిన చర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన కొరవి ధన్‌రాజ్‌ అలియాస్‌ అర్జున్‌..నారాయణ వద్ద డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా నారాయణ పేరుతో హయత్‌నగర్‌లో రెండు రూ.100 బాండ్‌ పేపర్లు కొనుగోలు చేశాడు. అనంతరం కిడ్నాప్, బెదిరింపు స్కెచ్‌ వేశాడు. ఈ విషయాన్ని తన మేనల్లుడు శివకుమార్, స్నేహితులు శ్రీకాంత్, శేఖర్‌కు విషయం చెప్పాడు. వారు అంగీకరించడంతో ప్లాన్‌ అమలు చేశారు.   

మహిళతో ఫోన్‌ చేయించి.. 
నారాయణను కిడ్నాప్‌ చేసే వ్యూహంలో భాగంగా..నగరంలోని మౌలాలికి చెందిన మక్కల భవానీకి డబ్బు ఆశ చూపారు. నారాయణకు ఫోన్‌ చేయించి మాయమాటలతో హనీ ట్రాప్‌ చేశారు. ఈ నెల 21న బొంగ్లూర్‌ వద్దకు పిలిపించారు. అప్పటికే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన పోలీస్‌ యూనిఫామ్‌ ధరించిన ధన్‌రాజ్‌ తాను ఎస్‌ఐ అని చెప్పి శివకుమార్, శ్రీకాంత్, శేఖర్‌ తనకు గన్‌మెన్లు అని చెప్పాడు. అనంతరం నారాయణతో పాటు అతని డ్రైవర్‌ ముజీబ్‌ను కారులో ఎక్కించి, ముఖాలకు నల్లటి ముసుగు వేసి కిడ్నాప్‌ చేశారు. వీరిని ఆదిబట్ల మున్సిపాలిటీ సమీపంలోని జేబీ గ్రీన్‌ వెంచర్‌ వద్దకు తీసుకెళ్లి గదిలో పెట్టారు. 

నీవు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫొటోలు మా వద్ద ఉన్నాయని బెదిరించారు. పోలీస్‌ డ్రస్సులో ఉన్న ధన్‌రాజ్‌ డమ్మీ గన్‌ తీసి నారాయణ కణతకు పెట్టి రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. అంత డబ్బు లేదని చెప్పడంతో రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు రెండు రోజుల్లో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని..ముందుగానే తెచి్చన 100 రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకాలు, వేలిముద్రలు పెట్టించుకున్నారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని కత్తులతో హెచ్చరించారు. అనంతరం ఏవీసీ టౌన్‌ షిప్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.   

ఐదుగురు నిందితుల రిమాండ్‌.. 
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి డమ్మీ పిస్టల్, పోలీసు యూనిఫామ్, బూట్లు, కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో «ఏ–1 నిందితుడు ధన్‌రాజ్‌ ఎంబీబీఎస్‌ మధ్యలో ఆపేశాడు. అనంతరం పలు ప్రైవేటు అస్పత్రుల్లో పనిచేశాడు. విలువిద్యలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. వలవోజు శివకుమార్, డేరంగుల శ్రీకాంత్, సుర్వి శేఖర్, మక్కల భవానీని సైతం రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కేపీవీ రాజు పర్యవేక్షణలో చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు రాజు, వెంకటేశ్, హెడ్‌ కానిస్టేబుల్‌ గిరి, రవీందర్, ఉపేందర్‌రెడ్డి, సందీప్, కృష్ణ, సంతోష్, శివచంద్ర, బి.రాజును డీసీపీ సునీతారెడ్డి అభినందించారు.  

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)