Breaking News

Rajasthan: బీజేపీ నేత, ఎంపీకి అత్యంత సన్నిహితుడు దారుణ హత్య

Published on Mon, 09/05/2022 - 13:35

జైపూర్‌: రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. భరత్‌పూర్‌లో కిర్పాల్‌ సింగ్‌ అనే బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కిర్పాల్‌ తన కారులో సర్క్యూట్‌ హౌస్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా కొంతమంది రెండు బైక్‌లు, అనేక కార్లలో వచ్చి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో సింగ్‌కు ఏడు బుల్లెట్లు గాయాలయ్యాయి.

సింగ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు, అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.

కాగా కిర్పాల్‌ సింగ్‌.. భరత్‌పూర్‌ బీజేపీ ఎంపీ రంజీతా కోలికి అత్యంత సన్నిహితుడు. సింగ్‌ మరణవార్త తెలిసిన వెంటనే ఎంపీ రంజీతా కోలి ఆసుపత్రికి వెళ్లారు. డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, కిసాన్ మోర్చా మాజీ ప్రతినిధి కిర్పాల్ సింగ్ మృతిచెందడం వల్ల ఈ రోజు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు ఎంపీ కోలీ హిందీలో ట్వీట్ చేశారు.
చదవండి: కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)